బెంగళూరు : ప్రొ కబడ్డీ లీగ్ (పీకేఎల్) పదో సీజన్లో జైపూర్ పింక్ పాంథర్స్ ఎట్టకేలకు బోణీ చేసింది. అర్జున్ దేశ్వాల్ కెరీర్లో 700వ రైడింగ్ పాయింట్ నమోదు చేయడంతో సోమవారం జరిగిన మ్యాచ్లో జైపూర్ 35–32తో గుజరాత్ జెయింట్స్పై నెగ్గింది.
ఈ మ్యాచ్లో దేశ్వాల్ 15 పాయింట్లతో మెరిశాడు. ఆరంభంలో 12–20తో వెనకబడ్డ జైపూర్ సెకండ్ హాఫ్లో రైడింగ్లో చెలరేగింది. మరో మ్యాచ్లో బెంగళూరు బుల్స్ 38–36తో యూపీ యోధాస్ను ఓడించింది. బెంగళూరు టీమ్లో వికాస్ ఖండోలా, భరత్ చెరో 11 పాయింట్లతో రాణించారు. పర్దీప్ నర్వాల్ (13), సురేందర్ గిల్ (8), విజయ్ మాలిక్ (6) మెరిసినా యూపీకి విజయాన్ని అందించలేకపోయారు.