అవినీతి బీఆర్ఎస్​ను గద్దె దింపుదాం : జలంధర్ రెడ్డి

అవినీతి బీఆర్ఎస్​ను గద్దె దింపుదాం : జలంధర్ రెడ్డి

మక్తల్, వెలుగు: అవినీతిలో కూరుకుపోయిన బీఆర్ఎస్ ​ప్రభుత్వాన్ని ఈ ఎన్నికల్లో గద్దె దింపుదామని మక్తల్​ బీజేపీ అభ్యర్థి మాదిరెడ్డి జలంధర్ రెడ్డి పిలుపునిచ్చారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా శనివారం ఆయన ఆత్మకూరు మండలం కత్తేపల్లి, తూంపల్లి, ఆరేపల్లి, తిపుడంపల్లి గ్రామాల్లో పర్యటించారు. ఈ సందర్భంగా అయన మాట్లాడుతూ రాష్ట్రంలో అవినీతి పాలనను అంతం చేయడం బీజేపీతోనే సాధ్యమన్నారు. కాంగ్రెస్  ఇచ్చిన ఆరు గ్యారెంటీలకు గ్యారెంటీ లేదన్నారు.

మక్తల్​ ఎమ్మెల్యే చేసిన అరాచక పాలనకు చరమగీతం పాడాలని, ఇసుక దందాలకు స్వస్తి పలకాలన్నారు. నియోజకవర్గంలో పదేండ్లుగా ఎలాంటి అభివృద్ధి జరగలేదన్నారు. అధికార పార్టీ ఎమ్మెల్యేలు అవినితికి పాల్పడి కోట్ల రూపాయలు దోచుకున్నారని విమర్శించారు. తెలంగాణలో బీజేపీ అధికారంలోకి  రావడం ఖాయమన్నారు. ఆదివారం మక్తల్​కు కేంద్ర హోం మంత్రి అమిత్​ షా వస్తున్నారని, ఈ ప్రోగ్రామ్​ను సక్సెస్​ చేయాలన్నారు. తనకు ఓట్లు వేసి భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. అశ్వినికుమార్​, బలరాంరెడ్డి, నారాయణ, నాగేందర్​రెడ్డి, గాడి శేషు, శ్రీనివాసులు, విష్ణువర్దన్​రెడ్డి, సూరీ, చందు పాల్గొన్నారు.