మన అగ్నివీర్ జవాన్ ను చంపేసిన పాకిస్తాన్ తీవ్రవాదులు

మన అగ్నివీర్ జవాన్ ను చంపేసిన పాకిస్తాన్ తీవ్రవాదులు

జమ్మూ కాశ్మీర్‌లోని నౌషేరా సెక్టార్‌లో ఈరోజు (జనవరి 18) నియంత్రణ రేఖ (ఎల్‌ఓసి) సమీపంలో ల్యాండ్‌మైన్ పేలుడు సంభవించింది. ఈ ఘటనలో అగ్నివీర్ జవాన్ మరణించగా, మరో ఇద్దరు గాయపడ్డారు. ఫార్వర్డ్ డిఫెన్స్ లైన్ (FDL) నుండి 300 మీటర్ల దూరంలో 80వ ఇన్‌ఫాంట్రీ బ్రిగేడ్ ఆధ్వర్యంలోని 17వ సిక్కు లైట్ బెటాలియన్‌కు చెందిన రెస్పాన్సిబిలిటీ (AOR) ప్రాంతంలో ఉదయం 10:30 గంటల ప్రాంతంలో ఈ సంఘటన జరిగింది. ఈ ఘాతుకానికి పాల్పడింది పాకిస్తాన్ తీవ్రవాదులేనని అధికారులు బలంగా నమ్ముతున్నట్టు సమాచారం.

గాయపడిన జవాన్లను చికిత్స కోసం హెలికాప్టర్‌లో ఉదంపూర్‌కు తరలించారు. మందుపాతర పేలుడులో అగ్నివీర్‌ జవాన్‌ వీరమరణం పొందినట్లు నౌషేరా పోలీస్‌ స్టేషన్‌ ఇన్‌ఛార్జ్‌ ధృవీకరించారు. ప్రాథమిక నివేదికల ప్రకారం, ఆర్మీ సిబ్బంది పెట్రోలింగ్ బృందం నియంత్రణ రేఖ వెంబడి సాధారణ నిఘా నిర్వహిస్తున్నప్పుడు ఈ సంఘటన జరిగింది. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.