బిహార్ లో వైద్య వ్యవస్థ దుస్థితి గురించి తెలిపే ఓ ఘటన తాజాగా వెలుగు చూసింది. పేషెంట్ మూత్రాన్ని సేకరించే యూరిన్ బ్యాగ్ లేకపోవడంతో వైద్య సిబ్బంది ఏకంగా కూల్డ్రింక్ బాటిల్ని మూత్ర సేకరణకు ఉపయోగించడం చర్చనీయాంశం అయింది.
బాధితుడి బంధువులు తెలిపిన వివరాల ప్రకారం.. జముయ్లోని గవర్నమెంట్ ఆసుపత్రిలో ఓ రోగి అనారోగ్యంతో చేరాడు. అపస్మారక స్థితిలో ఉన్న అతని మూత్రాన్ని సేకరించేందుకు యూరిన్ బ్యాగ్స్ స్టాక్ అయిపోయింది.
ALSO READ: Health : విటమిన్ డి లోపిస్తే.. డిప్రెషల్ లోకి వెళ్లిపోతారా.. పరిశోధనల్లో కీలక అంశాలు
దీంతో వైద్య సిబ్బంది తెలివి మితిమీరి స్ప్రైట్ బాటిల్ ని ఆయన మర్మాంగానికి అమర్చారు. కుటుంబసభ్యులు ఇదేంటని నిలదీయగా సిబ్బంది దురుసుగా సమాధానం ఇచ్చారు. ఈ దృశ్యాలను పలువురు వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.
సీఎం నీతిష్ కుమార్ పరిపాలనలో వైద్య వ్యవస్థ దుస్థితి ఎలా ఉందో ఈ ఘటన తెలియజేస్తోందని నెటిజన్లు ఫైర్ అవుతూ ట్వీట్ చేస్తున్నారు. మరొకరు ఈ వీడియోని ఉపముఖ్యమంత్రి తేజస్వీ యాదవ్కు ట్యాగ్చేస్తూ ప్రశ్నించారు.
స్పందించిన మేనేజర్..
ఈ ఘటనపై హాస్పిటల్ మేనేజర్ స్పందించారు. రోగికి బాటిల్ని అమర్చిన విషయం తన దృష్టికి రాలేదని అన్నారు. ఇందుకు కారణమైన వైద్యసిబ్బందిపై చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఘటనపై ఆ రాష్ట్ర ప్రతిపక్షాలు మండిపడుతున్నాయి. వైద్య వ్యవస్థ దుస్థితిపై నీతిష్ సర్కార్ను ప్రశ్నిస్తున్నాయి.