మీ బతుక్కి.. వైసీపీ మంత్రులపై నాగబాబు ఫైర్

మీ బతుక్కి.. వైసీపీ మంత్రులపై నాగబాబు ఫైర్

వాల్తేరు వీరయ్య(Valteru veerayya) 200 డేస్ ఈవెంట్ లో మెగాస్టార్ చిరంజీవి(Megastar Chiranjeevi) చేసిన కామెంట్స్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో దుమారం రేపుతున్నాయి. రాష్ట్రంలో ఉన్న సమస్యల గురించి కాకుండా.. పిచ్చుకపై బ్రహ్మాస్త్రంలా సినిమా ఇండస్ట్రీ పై పడటం సమంజసం కాదన్నారు ఏపీ రాష్ట్ర ప్రభుత్వానికి సూచించారు చిరంజీవి. అయితే చిరంజీవి ఈ వ్యాఖ్యలను ఖండిస్తూ.. మంత్రులు పేర్ని నాని(Perni Nani), కొడాలి నాని(Kodali Nani), అమర్నాథ్(Amarnath), బొత్స సత్యనారాయణ(Bothsa Sathyanarayana) కౌంటర్లు వేశారు.

సినిమా ఇండస్ట్రీలో పకోడీగాళ్లు ఎక్కువయ్యారని, బుద్ధిగా సినిమాలు చేసుకోవడం మానేసి రాజకీయాల గురించి అవసరమా.. తమను విమర్శించడానికంటే ముందు తమ్ముడు పవన్ కు బుద్ధి చెప్పుకో అంటూ చిరుకి సూచించారు. దీంతో మెగా ఫ్యాన్స్ వైసీపీ నాయకులపై మండిపడుతున్నారు. పలు చోట్ల ధర్నాలకు కూడా దిగారు.

కాగా ఇదే వ్యవహారంపై తాజాగా చిరంజీవి సోదరుడు, జనసేన నేత నాగబాబు(Nagababu) స్పందించారు. ఇందులో భాగంగా ఆయన మాట్లాడుతూ.. ఆయనతో ఫోటో దిగడానికి పడిగాపులు కాసిన వాళ్లు కూడా ఈరోజు కారుకూతలు కూస్తున్నారు. నిజం మాట్లాడిన వ్యక్తిపై విషం చిమ్ముతున్నారు. ఆకాశం మీద ఉమ్మెయ్యాలని చూస్తే.. అది తమ ముఖం మీద పడుతుందని గుర్తుంచుకోవాలని. బటన్ నొక్కితేనో..  ఉచితాలు ఇవ్వడమో అభివృద్ధా కాదు. ఈ దుర్మార్గపు పాలనకు త్వరలోనే ఎండ్ కార్డు పడుతుంది అంటూ ఏపీ మంత్రులపై విరుచుకుపడ్డారు నాగబాబు. ప్రస్తుతం నాగ బాబు చేసిన ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. మరి నాగ బాబు చేసిన ఈ కామెంట్స్ కు ఏపీ గవర్నమెంట్ నుండి ఎలాంటి స్పందన వస్తుందో చూడాలి.