
జనగామ అర్బన్, వెలుగు: మహిళలు, పిల్లలకు మెరుగైన ఆరోగ్య సేవల కోసం స్వస్త్ నారీ, సశక్తి పరివార్అభియాన్ కార్యక్రమాన్ని జిల్లాలో పకడ్బందీగా అమలు చేయాలని జనగామ కలెక్టర్ రిజ్వాన్ భాషా షేక్ అధికారులను ఆదేశించారు.
ఆదివారం ఆయన మాట్లాడుతూ మెరుగైన ఆరోగ్య సంరక్షణ సేవల ద్వారా మహిళలు, పిల్లల సాధికారతే లక్ష్యంగా స్వస్త్నారి, సశక్త్ పరివార్అభియాన్కార్యక్రమం ఈ నెల 17 నుంచి అక్టోబర్ 2 వరకు నిర్వహిస్తున్నారని, ఆరోగ్య శిబిరాలు ఏర్పాటు చేసి ప్రత్యేకంగా రూపొందించిన ముఖ్యమైన సేవలను అందించనున్నట్లు తెలిపారు.
ఆయుష్మాన్ ఆరోగ్య మందిరాలు, అవగాహన, ప్రవర్తన మార్పు సెషన్లు, నిక్షయ్మిత్ర నమోదు డ్రైవ్, మెగా రక్తదాన కార్యక్రమం, ప్రైవేట్రంగం భాగస్వామ్యం, పోషన్మాహ్తో కన్వర్జెన్స్ఈ శిబిరాలు అంతటా నిర్వహిస్తామన్నారు. పీహెచ్సీలు, హాస్పిటల్స్లో మహిళలు, పిల్లల నిర్దిష్ట అవసరాలపై దృష్టి సారించి, అన్ని అంగన్వాడీల్లో పోషన్ మాహ్ వేడుకలతోపాటు ఆరోగ్య సంరక్షణ సేవలను అందిస్తాయని కలెక్టర్ చెప్పారు.