
జనగామ అర్బన్, వెలుగు: జడ్పీటీసీ, ఎంపీటీసీ స్థానాల తుది ఓటరు జాబితాను ఈ నెల 10 న ప్రకటించనున్నట్టు జనగామ కలెక్టర్ రిజ్వాన్ భాషా షేక్ తెలిపారు. సోమవారం కలెక్టరేట్లో అడిషనల్ కలెక్టర్పింకేశ్ కుమార్, జడ్పీ సీఈవో మాధురి షాతో కలిసి గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్మాట్లాడుతూ రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశాలకు అనుగుణంగా ఇప్పటికే అన్ని మండలాల్లో గ్రామ పంచాయతీల వారీగా ముసాయిదా ఓటరు జాబితా, పోలింగ్ కేంద్రాల జాబితాను ప్రచురించామన్నారు.
ఏమైనా అభ్యంతరాలు ఉంటే తెలుపాలని కోరారు. సమావేశంలో డిప్యూటీ సీఈవో సరిత, వివిధ పార్టీల ప్రతినిధులు పాల్గొన్నారు. జనగామ జిల్లాలో కొత్తగా జీపీవోలు విధుల్లో చేరినట్లు కలెక్టర్ తెలిపారు. జిల్లాలో 129 క్లస్టర్లు ఏర్పాటు చేయగా 129 మందికి పోస్టింగ్ ఇచ్చామని, వారు తహసీల్దార్ ఆఫీసుల్లో రిపోర్టు చేశారని చెప్పారు. అనంతరం జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆస్పత్రిలో వైద్యారోగ్య శాఖ ఆధ్వర్యంలో నిర్వహించి ప్రపంచ ఫిజియోథెరపీ డేకు కలెక్టర్ హాజరయ్యారు. డీఎంహెచ్వో మల్లికార్జున్రావుతో కలిసి రోగులకు పండ్లు పంపిణీ చేశారు.