
శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్ టాలీవుడ్ ఎంట్రీ అంటూ గత కొన్నేండ్లుగా ప్రచారం జరగగా, ఇటీవల ఎన్టీఆర్తో జోడీ కట్టనుందనే గుడ్ న్యూస్ వినిపించాడు దర్శకుడు కొరటాల. తాజాగా మరో స్టార్ హీరోకి జంటగా జాన్వీ కనిపించనుందనే టాక్ టాలీవుడ్లో వినిపిస్తోంది. రామ్ చరణ్ హీరోగా ‘ఉప్పెన’ ఫేమ్ బుచ్చిబాబు సాన దర్శకత్వంలో ఓ మూవీ రూపొందనున్న సంగతి తెలిసిందే. ఇందులో హీరోయిన్గా జాన్వీ కపూర్ను సంప్రదించగా.. ఆమె దాదాపుగా గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసిందని తెలుస్తోంది. అంటే ‘ఆర్ఆర్ఆర్’తో పాన్ వరల్డ్లో గుర్తింపును అందుకున్న ఇద్దరు స్టార్ హీరోలతోనూ నటించే చాన్స్ అందుకుంటోంది. ఈ రెండు చిత్రాలతో టాలీవుడ్లో గ్రాండ్గా కెరీర్ స్టార్ట్ చేయబోతోందామె. దర్శకుడు బుచ్చిబాబు ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్లో బిజీగా ఉన్నాడు. కబడ్డీ బ్యాక్డ్రాప్లో ఈ చిత్రం తెరకెక్కనుందని తెలుస్తోంది. అలాగే ఇందులో కూడా చరణ్ డ్యూయెల్ రోల్లో కనిపించనున్నాడట. ఒక హీరోయిన్గా జాన్వీ కపూర్ను, మరో హీరోయిన్గా మృణాల్ ఠాకూర్ని తీసుకోబోతున్నట్టు తెలుస్తోంది. అలాగే ఏ.ఆర్.రెహమాన్తో ఈ మూవీకి మ్యూజిక్ చేయించే ప్రయత్నాలు జరుగుతున్నాయనే టాక్ వినిపిస్తోంది.