నవోదయలో లేటరల్‌‌ ఎంట్రీ అడ్మిషన్స్​

నవోదయలో  లేటరల్‌‌ ఎంట్రీ అడ్మిషన్స్​

దేశవ్యాప్తంగా 650 జవహర్‌‌ నవోదయ విద్యాలయా(జేఎన్‌‌వీ)ల్లో తొమ్మిదో తరగతిలో ఖాళీల సీట్ల భర్తీ(లేటరల్‌‌ ఎంట్రీ)కి సంబంధించి జేఎన్‌‌వీ ఎంపిక పరీక్షకు దరఖాస్తులు కోరుతోంది. ఎంపికైన విద్యార్థులకు 9వ తరగతి నుంచి 12వ తరగతి వరకు ఉచిత విద్య అందిస్తారు.

అర్హత: ప్రవేశానికి అర్హత పొందాలంటే విద్యార్థి తప్పనిసరిగా జవహర్ నవోదయ విద్యాలయం ఉన్న సంబంధిత జిల్లాల్లో నివాసి అయి ఉండాలి. విద్యార్థులు 2023-–24 విద్యా సంవత్సరంలో ఆయా జిల్లాల్లోని ప్రభుత్వ, ప్రభుత్వ గుర్తింపు పొందిన పాఠశాలల్లో ఎనిమిదో తరగతి చదువుతుండాలి. 

ప్రవేశ పరీక్ష: జవహర్‌‌ నవోదయ ప్రవేశానికి నిర్వహించే రాత పరీక్షలో వచ్చే మార్కులు ఆధారంగా విద్యార్థుల ఎంపిక ఉంటుంది. ప్రవేశ పరీక్ష ప్రశ్నపత్రంలో నాలుగు విభాగాలు(ఇంగ్లీష్‌‌, హిందీ, సైన్స్‌‌, మ్యాథమెటిక్స్‌‌) ఉంటాయి. మొత్తం 100 ప్రశ్నలు 100 మార్కులకు 2.30 గంటల సమయంలో ఎగ్జామ్​ ఉంటుంది.


దరఖాస్తులు: ఆన్‌‌లైన్‌‌లో జేఎన్‌‌వీ అధికారిక వైబ్‌‌సైట్‌‌ ద్వారా అక్టోబర్​ 31 వరకు దరఖాస్తు చేసుకోవాలి. ఎంట్రెన్స్​ పరీక్ష 2024 ఫిబ్రవరి 10న నిర్వహించనున్నారు. వివరాలకు www.navodaya.gov.in వెబ్​సైట్​లో సంప్రదించాలి.