ఆర్మీ కల్నల్ తన ఆఫీసులోనే సెక్స్ చేసేవాడంటూ ఇద్దరు జవాన్లు ఏకంగా రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్కు ఫిర్యాదు చేశారు. కొన్నాళ్ల క్రితం రిటైర్ అయిన ఆఫీసర్ చేసే పనులను బయటపెట్టే ప్రయత్నం చేసినందుకు గతంలో తమను వేధించాడని లేఖ ద్వారా తెలిపారు. దీంతో ఇప్పుడు ఆ అధికారి కోర్ట్ ఆఫ్ ఎంక్వైరీ ఎదుర్కొంటున్నాడు.
పంజాబ్లోని అబోహర్లో పని చేసిన ఆర్మీ కల్నల్పై ఆయన కింద పని చేసిన 25 రాజ్పుతన రైఫిల్స్కి చెందిన ఇద్దరు జవాన్లు రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్కు లేఖ రాశారు. ఆ అధికారి తన కింది ఉద్యోగులతో దురుసుగా ప్రవర్తించేవాడని, దీనిపై ఎదురు తిరిగితే వేధించేవాడని ఫిర్యాదు చేశారు. అతడికి ఎలాగైనా బుద్ధి చెప్పాలని, ఆఫీసులో ఓ కింది స్థాయి ఉద్యోగినితో శృంగారం చేస్తుండగా తాము వీడియో తీశామని తెలిపారు. అన్ని సాక్ష్యాలను పరిశీలించి అతడిపై చర్యలు తీసుకోవాల్సిందిగా కోరారు. దీనిపై రక్షణ మంత్రి విచారణకు ఆదేశించారు.
ఆర్మీ కల్నల్ ప్రస్తుతం రైటైర్ అయి ఉన్నప్పటికీ ఆర్మీ చట్టాల ప్రకారం విచారిస్తున్నట్లు అధికారులు తెలిపారు. కోర్టు ఆఫ్ ఎంక్వైరీలో అతడు తప్పు చేసినట్లుగా తేలితే కోర్టు మార్షల్ చేసి, కఠిన శిక్ష వేస్తారు. అయితే ఆర్మీ అధికారి వీడియో తీసి ఆ జవాన్లు ఏమైనా బ్లాక్మెయిల్ చేసే ప్రయత్నం చేశారా అన్న కోణంలోనూ దర్యాప్తు చేస్తున్నట్లు ఓ అధికారి చెప్పారు.
See more news