ఢిల్లీ: జేఈఈ మెయిన్స్ కు సంబంధించిన ఫలితాలను నేషనల్ టెస్టింగ్ ఏజేన్సీ మంగళవారం అర్ధరాత్రి విడుదలచేసింది. ఈ ఫలితాలలో తెలంగాణకు చెందిన ఇద్దరు విద్యార్థులు మొదటి ర్యాంకును దక్కించుకున్నారు. రాష్ట్రానికి చెందిన కొమ్మ శరణ్య మరియు జోస్యుల వెంకట ఆదిత్య 100 శాతం మార్కులు సాధించి ఫస్ట్ ర్యాంకును సాధించారు. వీరితో పాటు మరో 16 మంది విద్యార్థులు కూడా మొదటి ర్యాంకును సాధించారు. అంతేకాకుండా.. ఈ ఎగ్జామ్ రాసినవారిలో మొత్తం 44 మంది వంద శాతం స్కోర్ సాధించారు. విద్యార్థుల సౌకర్యార్థం ఈ పరీక్షను ఏడాదికి నాలుగుసార్లు నిర్వహిస్తున్నారు. విద్యార్థుల ఒకసారి రాసిన పరీక్షలో మంచి మార్కులు రాకుంటే.. మరోసారి రాసి తమ ఉత్తీర్ణత శాతాన్ని పెంచుకోవచ్చు. విద్యార్థులకు ఏ పరీక్షలో మంచి మార్కులు వస్తాయో దానిని మాత్రమే పరిగణనలోకి తీసుకుంటారు. మొత్తం నాలుగు విడతలలో కలిపి ఈ పరీక్షకు 9.34 లక్షల మంది విద్యార్థులు హాజరయ్యారు. తెలుగు, ఉర్దూతో పాటు మొత్తం 13 భాషలలో ఈ పరీక్షను నిర్వహించారు. ఈ ఏడాది ఫిబ్రవరి మరియు మార్చిలలో మొదటి, రెండవ విడతల పరీక్షను నిర్వహించారు. ఆ తర్వాత ఏప్రిల్ మరియు మే నెలల్లో మూడో, నాలుగో విడతల పరీక్షను నిర్వహించాలని అధికారులు భావించారు. కానీ, కరోనా సెకండ్ వేవ్ కారణంగా వాయిదావేశారు. కరోనా తీవ్రత తగ్గుముఖం పట్టిన తర్వాత జూలై 20 నుంచి 25 వరకు మూడో విడత మరియు ఆగష్టు 26 నుంచి సెప్టెంబర్ 2 వరకు నాలుగో విడత పరీక్షను నిర్వహించారు.
జేఈఈ రిజల్ట్స్: ఇద్దరు తెలంగాణ విద్యార్థులకు ఫస్ట్ ర్యాంకు
- దేశం
- September 15, 2021
లేటెస్ట్
- IPL 2024: ఎట్టకేలకు సాధించాడు: కోహ్లీ దగ్గర నుంచి బ్యాట్ సంపాదించిన రింకూ సింగ్
- ఒంటెపై వచ్చి.. నామినేషన్ వేసిన హైదరాబాద్ ఎంపీ అభ్యర్థి
- జగన్.. ఇక బ్యాండేజ్ తీసేయ్.. సునీత
- కోట్లకు పడగలెత్తిన దోమ వ్యాపారం ఇదే..
- April 25th World Malaria Day : మాయదారి మహమ్మారి.. మలేరియా
- SRH vs RCB: ఉప్పల్లో మ్యాచ్.. టాస్ గెలిచి బ్యాటింగ్ తీసుకున్న బెంగళూరు
- రామగుండం పోలీస్ కమిషనరేట్ లో.. సోషల్ మీడియా ట్రాకింగ్ సెంటర్
- ఫ్రీఫుడ్ వీడియో షేర్ చేశాడని..ఉద్యోగం నుంచి తీసేశారు
- Loksabha Elections: బంపర్ ఆఫర్.. ఓటేస్తే బీరు, దోశ, క్యాబ్ ఫ్రీ ఫ్రీ ఫ్రీ...
- చికెన్ తింటున్నారా జాగ్రత్త..కోళ్లలో కొత్త రకం వైరస్..ఏవియన్ ఫ్లూ వస్తోంది
Most Read News
- చంద్రయాన్2 సక్సెస్ ఫుల్గా పనిచేస్తుంది..జపాన్ మూన్ ల్యాండర్ ఫొటోలు పంపింది
- కోహ్లీ కోసం..ఉప్పల్లో ఆర్సీబీతో సన్రైజర్స్ మ్యాచ్..అందరి ఫోకస్ విరాట్పైనే
- మలుపులో మెట్రో రైలు సౌండ్స్..భరించలేకపోతున్నాం
- DC vs GT: మోహిత్ శర్మను చితక్కొట్టిన పంత్.. ఐపీఎల్ చరిత్రలోనే చెత్త రికార్డ్
- శ్రీశైలం వెళ్లే భక్తులకు గుడ్ న్యూస్.. హైదరాబాద్ నుంచి గంటకో ఏసీ బస్సు
- ఆన్ లైన్ ట్రేడింగ్ వలలో మాజీ ఐఏఎస్.. ఏకంగా రూ. కోటి 87 లక్షలు పోగొట్టుకున్నారు
- Health Tips: రాత్రిపూట ఏ టైంలో స్నానం చేయాలో తెలుసా..
- ఏప్రిల్ 26న ఐటీ కారిడార్లో ట్రాఫిక్ ఆంక్షలు
- Telangana Special : ఇప్ప పువ్వు పూసింది.. గూడెం మురిసింది.. తెల్లవారుజామునే అడవిలో సందడి
- సుర్రు సమ్మర్.... ఎల్నినో ప్రభావం