జార్ఖండ్ నక్సల్స్ కాల్పుల్లో హైదరాబాద్ వాసి మృతి

జార్ఖండ్  నక్సల్స్ కాల్పుల్లో హైదరాబాద్ వాసి మృతి

జార్ఖండ్ రాష్ట్రంలో నక్సలైట్లు రెచ్చిపోయారు. హైదరాబాద్ నగరానికి చెందిన వీ.శరత్ బాబు అనే వ్యక్తిని అతి దారుణంగా కాల్చి చంపారు. శరత్ బాబు మృతితో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరవుతున్నారు. 

హైదరాబాద్ కొత్తపేట విజయపురి కాలనీలో ని సన్ షైన్ అపార్ట్మెంట్లో  వీ.శరత్ బాబు (55) నివాసం  ఉంటున్నాడు. ఆంధ్రప్రదేశ్ కు చెందిన రాజ్యసభ సభ్యుడు సీఎం రమేష్ కంపెనీలో శరత్ బాబు కాంట్రాక్ట్ మేనేజర్ గా పనిచేస్తున్నాడు. గతంలో ఒరిస్సాలో జరిగిన ప్రాజెక్టు వర్క్లో కూడా ఇతను పనిచేశాడు.  కాంట్రాక్టు వర్క్ విషయమై నాలుగు రోజుల క్రితం శరత్ బాబు ఝార్ఖండ్ వెళ్ళాడు. కాగా మే 9వ తేదీ మంగళవారం విధి నిర్వహణ నిమిత్తం వాహనంలో వెళ్తుండగా అతన్ని మావోయిస్టులు కాల్చి చంపారని సమాచారం. శరత్ బాబుకు భార్య ఒక కొడుకు ఉన్నారు.