గ్యాంగ్‌‌‌‌స్టర్ హీరో అయితే..

గ్యాంగ్‌‌‌‌స్టర్ హీరో అయితే..

రాఘ‌‌‌‌వ లారెన్స్‌‌‌‌, ఎస్‌‌‌‌.జె.సూర్య లీడ్ రోల్స్‌‌‌‌లో కార్తీక్ సుబ్బరాజ్ రూపొందిస్తున్న చిత్రం ‘జిగర్తాండ డబుల్ ఎక్స్’. స్టోన్ బెంచ్ ఫిలింస్ బ్యానర్‌‌‌‌‌‌‌‌పై కార్తికేయన్ సంతానం, ఎస్.కదిరేశన్ నిర్మిస్తున్నారు. సోమవారం ఈ మూవీ తెలుగు టీజర్‌‌‌‌‌‌‌‌ను  హీరో మహేష్​ బాబు విడుదల చేయగా, తమిళంలో ధనుష్, మలయాళంలో దుల్కర్ సల్మాన్, కన్నడలో రక్షిత్ శెట్టి రిలీజ్ చేశారు.

లారెన్స్‌‌‌‌ గన్‌‌‌‌ పట్టుకుని గ్యాంగ్‌‌‌‌స్టర్‌‌‌‌‌‌‌‌గా కనిపిస్తుండగా.. తనని హీరోగా పెట్టి పాన్ ఇండియా సినిమా చేసే ఫిల్మ్ మేకర్‌‌‌‌‌‌‌‌గా ఎస్‌‌‌‌.జె.సూర్య కనిపిస్తున్నాడు. తొమ్మిదేళ్ల క్రితం కార్తీక్ సుబ్బరాజ్ తీసిన ‘జిగర్తాండ’ (తెలుగులో ‘గద్దలకొండ గణేష్‌‌‌‌’) లోనూ కథ ఇదే. అయితే ఈసారి 1975 బ్యాక్‌‌‌‌‌‌‌డ్రాప్‌‌‌‌లో సాగే పీరియాడికల్ డ్రామాగా దీన్ని మార్చాడు దర్శకుడు. అందుకు తగ్గట్టే లారెన్స్, సూర్య వింటేజ్‌‌‌‌ లుక్‌‌‌‌లో కనిపించి ఆకట్టుకున్నారు. సంతోష్ నారాయణన్ బ్యాక్‌‌‌‌గ్రౌండ్‌‌‌‌ స్కోరుతో సాగిన  టీజర్ సినిమాపై ఆసక్తిని పెంచింది. దీపావళికి సినిమా రిలీజ్ కానుంది.