కూకట్పల్లి, వెలుగు: జేఎన్టీయూలో పరిశోధనల అభివృద్ధిలో భాగంగా సోమవారం వర్సిటీ అధికారులు ఇరాన్కు చెందిన ఇస్ఫహాన్ యూనివర్సిటీ అధికారులతో ఆన్లైన్ సమావేశం నిర్వహించారు. ఇస్ఫహాన్ వర్సిటీ అధ్యక్షుడు, డైరెక్టర్ల బోర్డు అధిపతి రసౌల్ రోక్నిజాదే, ఇరాన్ అధికారులతో జరిగిన ఆన్లైన్ సమావేశంలో జేఎన్టీయూ రిజిస్ట్రార్ డాక్టర్ కె.వెంకటేశ్వరరావు పాల్గొని మాట్లాడారు.
వర్సిటీ విద్యా కార్యకలాపాలు, పరిశోధన, అభివృద్ధితో పాటు జేఎన్టీయూలో ఉన్న మౌలిక సదుపాయాలపై ప్రజెంటేషన్ ఇచ్చారు. రెండు వర్సిటీల మధ్య గ్రాడ్యుయేట్, పోస్ట్ గ్రాడ్యుయేట్ విద్యార్థుల మార్పిడీ, ఫ్యాకల్టీ మార్పిడీ అంశాలపై చర్చించారు. అంతకు ముందు జేఎన్టీయూ డైరెక్టర్ డాక్టర్ కె.విజయకుమార్రెడ్డి, రిజిస్ట్రార్ వెంకటేశ్వరరావు, ప్రిన్సిపాల్ జీవీ నరసింహారెడ్డి, వైస్ ప్రిన్సిపాల్ ఎ.రఘరామ్తో సమావేశం నిర్వహించారు.
