
గద్వాల టౌన్, వెలుగు: గద్వాల ప్రభుత్వ ఐటీఐ కళాశాలలో ఈ నెల 17న జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు ప్రిన్సిపాల్ సత్యనారాయణ ఒక ప్రకటనలో తెలిపారు. ఈ మేళాలో కేఎల్ గ్రూప్ వారి ఎస్ కే సేఫ్టీ వింగ్ వారు పాల్గొంటున్నారని పేర్కొన్నారు. పదోతరగతి, ఇంటర్మీడియట్, ఐటీఐ పాసైన యువత సద్వినియోగం చేసుకోవాలన్నారు. మరిన్ని వివరాలకు 91105 23925 ఫోన్నంబర్లో సంప్రదించాలని సూచించారు.