కాగజ్ నగర్లో గుండెపోటుతో జర్నలిస్ట్ మృతి

కాగజ్ నగర్లో గుండెపోటుతో  జర్నలిస్ట్ మృతి

కాగజ్ నగర్, వెలుగు: కాగజ్ నగర్ పట్టణానికి చెందిన చెన్నూరి సందీప్ కుమార్(33) అనే జర్నలిస్ట్ గుండెపోటుతో మృతి చెందాడు. కొన్నేండ్లుగా ఎలక్రానిక్ మీడియాలో జర్నలిస్ట్​గా పనిచేస్తున్న సందీప్ బుధవారం మధ్యాహ్నం అస్వస్థతకు గురయ్యాడు. వెంటనే ఆయనను స్థానిక ప్రైవేట్ హాస్పిటల్ కు తరలించి చికిత్స అందించారు. డాక్టర్ల సూచన మేరకు మంచిర్యాలకు తరలించి ట్రీట్​మెంట్ అందిస్తుండగా అర్ధరాత్రి సందీప్​కు గుండెపోటు వచ్చి హాస్పిటల్​లో మృతి చెందాడు. 

ఆయన అంత్యక్రియలు గురువారం పూర్తికాగా.. సిర్పూర్ (టీ) ఎమ్మెల్యే కోనేరు కోనప్ప, కోనేరు ట్రస్ట్ చైర్మన్ వంశీ, జర్నలిస్ట్ సంఘాల జిల్లా నాయకులు రవి నాయక్, అబ్దుల్ రెహమాన్, అరుణ్ కుమార్, స్థానిక జర్నలిస్టులు నివాళి అర్పించారు.