RRR: 'ఆస్కార్' రెడ్ కార్పెట్‌పై నడవనున్న తెలుగు సినీ దిగ్గజాలు

RRR: 'ఆస్కార్' రెడ్ కార్పెట్‌పై నడవనున్న తెలుగు సినీ దిగ్గజాలు

తెలుగు సినిమా ఖ్యాతిని ప్రపంచానికి చాటి చెప్పిన ఆర్ఆర్ఆర్ ఇప్పుడో మరో కీలక ఘట్టానికి చేరుకోనుంది. ఎపిక్ పీరియడ్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కిన ఆర్ఆర్ఆర్ లోని నాటు నాటు సాంగ్ కు గోల్డెన్ గ్లోబ్స్‌ అవార్డు తర్వాత.. 'ఉత్తమ ఒరిజినల్ సాంగ్' విభాగంలో ఈ పాట ఆస్కార్ కు నామినేట్ అయింది. లాస్ ఏంజెల్స్ లో మరో రెండు రోజుల్లో ప్రారంభం కానున్న ఆస్కార్ వేడుకలకు సినీ దిగ్గజ దర్శకుడు రాజమౌళిపాటు యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ లు హాజరు కానున్నారు. వారందరూ ఆస్కార్ వేదికగా రెడ్ కార్పెట్ పై నడవడానికి అంతా సిద్ధమైంది. ఆ సన్నివేశం కోసం యావత్ భారతదేశం ఆసక్తిగా ఎదురుచూస్తోంది. ఈ సందర్భంగా ఆస్కార్ రెడ్‌కార్పెట్‌పై నడవబోయేది ఎన్టీఆరో, కొమరం భీమో కాదని.. ఒక్కమాటలో చెప్పాలంటే భారతదేశం రెడ్ కార్పెట్ పై నడబోతోందని తారక్ ఇటీవల ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు. దేశం మొత్తాన్ని తమ హృదయాలలో మోస్తూ నడవబోతున్నామన్నారు. తాను కూడా ఆ సమయం కోసమే ఎదురుచూస్తున్నానని స్పష్టం చేశారు. ఈ అవార్డ్స్ ఫంక్షన్ తర్వాత ఎన్టీఆర్ త్వరలోనే తన నెక్స్ట్ ప్రాజెక్ట్ దర్శకుడు కొరటాల శివతో కలిసి జాన్వీ కపూర్‌తో కలిసి షూటింగ్ లో పాల్గొననున్నారని సమాచారం. ఇక ఇది 5 ఏప్రిల్ 2024న సిల్వర్ స్క్రీన్‌పై అలరించనుంది.