ఇవాళ కవిత బెయిల్ పిటిషన్ పై తీర్పు

ఇవాళ కవిత బెయిల్ పిటిషన్ పై తీర్పు

న్యూఢిల్లీ, వెలుగు: లిక్కర్ స్కామ్​ కేసులో తీహార్ జైల్లో ఉన్న ఎమ్మెల్సీ కవిత బెయిల్ పిటిషన్​పై గురువారం రౌస్ అవెన్యూ కోర్టు(ట్రయల్ కోర్టు) తుది తీర్పు వెలువరించనుంది. ఈ ఏడాది మార్చి 15న ఈడీ, ఏప్రిల్ 11న సీబీఐ కవితను అరెస్ట్ చేశాయి. తర్వాత ఆమెకు ట్రయల్ కోర్టు జ్యుడీషియల్ కస్టడీ విధించింది. తనకు రెగ్యులర్ బెయిల్ మంజూరు చేయాలని కవిత రౌస్ అవెన్యూ కోర్టును ఆశ్రయించారు.