
న్యూఢిల్లీ : ఆసియా గేమ్స్ ట్రయల్స్ నుంచి స్టార్ రెజ్లర్లు వినేశ్ ఫోగాట్, బజ్రంగ్ పూనియాలకు మినహాయింపు ఇవ్వడంపై జూనియర్ రెజ్లర్లు, వాళ్ల తల్లిదండ్రులు నిరసనకు దిగారు. మినహాయింపు వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తూ దాదాపు 150 మంది ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్ (ఐవోఏ) ప్రెసిడెంట్ పీటీ ఉష, అడ్హక్ ప్యానెల్ చీఫ్ భూపేంద్ర సింగ్ బాజ్వాను కలిసేందుకు ప్రయత్నించారు. ‘ఐవోఏ చీఫ్ను మేం కలవాలి. పక్షపాత నిర్ణయాలను మేం సహించం. ఇది చాలా అన్యాయం. వినేశ్, బజ్రంగ్కు ఇచ్చిన మినహాయింపు వెనక్కి తీసుకోవాలి. వాళ్లకు కూడా ట్రయల్స్ను నిర్వహించాలి’ అని అంటిమ్ ఫంగల్ కోచ్ వికాస్ భరద్వాజ్ వ్యాఖ్యానించారు.
అడ్హక్ కమిటీ తీసుకునే నిర్ణయాలు సరిగా లేవని అంటిమ్ ఫంగాల్, అండర్–23 ఆసియా చాంపియన్ సుజీత్ కల్కాల్ ధ్వజమెత్తారు. బజ్రంగ్, వినేశ్ను ఓడించే సత్తా తమకు ఉందని ఘాటుగా విమర్శించారు. మరోవైపు జూనియర్లకు మద్దతుగా నిలుస్తామని, ఈ విషయాన్ని మరోసారి పరిశీలిస్తామని ఐవోఏ అధికారులు తెలిపారు.