షాంఘై: ఆర్చరీ వరల్డ్ కప్ స్టేజ్–1లో ఇండియా ఆర్చర్లు సత్తా చాటుతున్నారు. శుక్రవారం జరిగిన విమెన్స్ కాంపౌండ్ మిక్స్డ్ టీమ్ సెమీస్లో తెలుగమ్మాయి జ్యోతి సురేఖ వెన్నం–అభిషేక్ వర్మ 155–151తో ఆండ్రియా బెకెరా–లాట్ మాక్సిమో (మెక్సికో)పై నెగ్గి ఫైనల్లోకి అడుగుపెట్టారు. ఫలితంగా ఇండియాకు నాలుగో మెడల్ను ఖాయం చేశారు. ఆరంభం నుంచే అద్భుతమైన గురితో ఆకట్టుకున్న వరల్డ్ రెండో ర్యాంకర్ ఇండియన్ జోడీ ప్రత్యర్థులకు ఎక్కడా చాన్స్ ఇవ్వలేదు. కాకపోతే మధ్యలో ఒక్కసారి నాలుగు పాయింట్లు కోల్పోయినా తిరిగి పుంజుకున్నారు. విమెన్స్ రికర్వ్ ఇండివిడ్యువల్ క్వార్టర్ఫైనల్లో దీపిక కుమారి 6–4 (27–28, 27–27, 29–28, 29–27, 28–28)తో జియోన్ హున్ యంగ్ (కొరియా)పై నెగ్గి సెమీస్లోకి ప్రవేశించింది. రికర్వ్ మిక్స్డ్ టీమ్ సెమీస్లో అంకిత భాకట్–ధీరజ్ బొమ్మదేవర 0–6 (38–39, 35–36, 36–38)తో టాప్ సీడ్ కొరియా ద్వయం లిమ్–కిమ్ చేతిలో ఓడారు. వీళ్లు బ్రాంజ్ మెడల్ మ్యాచ్లో మెక్సికోతో తలపడతారు. ఇండివిడ్యువల్ క్వార్టర్స్లో తరుణ్దీప్ రాయ్ 3–7తో ఆండ్రెస్ టెమినో చేతిలో ఓడాడు.