
న్యూఢిల్లీ: ఇండియా అథ్లెటిక్స్ రైజింగ్ స్టార్, తెలుగమ్మాయి యెర్రాజి జ్యోతి వరల్డ్ అథ్లెటిక్స్ చాంపియన్షిప్స్లో పోటీ పడనుంది. హంగేరిలోని బుడాపెస్ట్లో ఈ నెల 19న మొదలయ్యే ఈ టోర్నీ కోసం 28 మందితో కూడిన ఇండియా అథ్లెటిక్స్ టీమ్ను స్పోర్ట్స్ మినిస్ట్రీ మంగళవారం ప్రకటించింది. స్టార్ జావెలిన్ త్రోయర్, ఒలింపిక్ చాంపియన్ నీరజ్ చోప్రా మరోసారి ఫేవరెట్గా బరిలోకి దిగనున్నాడు. అమెరికాలో జరిగిన గత ఎడిషన్లో సిల్వర్ నెగ్గిన చోప్రా ఈ సారి గోల్డ్ మెడల్పై గురి పెట్టాడు. విమెన్స్ 100 మీటర్ల హర్డిల్స్లో పోటీలో ఉన్న జ్యోతిపైనా అంచనాలున్నాయి. జులైలో ఆసియా చాంపియన్షిప్స్ సందర్భంగా గాయపడ్డ షాట్ పుట్టర్ తేజిందర్ సింగ్ పాల్ ఈ టోర్నీకి దూరంగా ఉంటున్నాడు. సెప్టెంబర్లో జరిగే ఆసియా గేమ్స్పై ఫోకస్ పెట్టేందుకు హై జంపర్ తేజస్విన్, 800 మీ రన్నర్ చందన, 20 కి.మీ రేస్ వాకర్ ప్రియాంక కూడా దూరంగా ఉంటున్నారు.