జనగామ బరిలో ఉంటా!: ప్రజాశాంతి పార్టీ చీఫ్​ కేఏ పాల్​ వెల్లడి

జనగామ బరిలో ఉంటా!:  ప్రజాశాంతి పార్టీ చీఫ్​ కేఏ పాల్​ వెల్లడి

 

జనగామ, వెలుగు :  జనగామలో తమ పార్టీకి మంచి ఆదరణ ఉందని ఇక్కడి నుంచి బరిలో నిలువాలని ఆలోచిస్తున్నట్లు ప్రజాశాంతి పార్టీ చీఫ్​ కేఏ పాల్​ చెప్పారు.  ఆదివారం సాయంత్రం అయన జనగామలోని ఆర్టీసీ చౌరస్తాలో సందడి చేశారు. తదుపరి సూర్యాపేట రోడ్డులో ఉన్న కెమిస్ట్​ భవన్​లో మీడియాతో మాట్లాడారు..   కుటుంబ పాలన కావాలంటే కేసీఆర్​ను, కుల పాలన కావాలంటే రేవంత్​ రెడ్డి, ఆ రెడ్డి.. ఈ రెడ్డిలను ఎన్నుకోవాలన్నారు. 

5 లక్షల కోట్లు అప్పులు తీర్చి మరో 5 లక్షల కోట్ల అభివృద్ధి చేయాలంటే ప్రజా శాంతి పార్టీని అధికారంలోకి తీసుకురావాలని కోరారు.  వైఎస్​ షర్మిల తన పార్టీలో చేరితే పాలేరు నుంచి గెలిపిస్తానన్నారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో తమకు కాంగ్రెస్​ నుంచి పోటీ లేదన్నారు.  కేవలం 79 స్థానాల్లో బీఆర్​ఎస్, ఎంఐఎం నుంచి పోటీ ఉందన్నారు. కేసీఆర్​ వద్ద ఉన్న బీసీ నాయకులు అందరూ తన పార్టీలో చేరాలని పిలుపునిచ్చారు.