- నిర్ణయం తీసుకోవాల్సిన టైమొచ్చిందని వ్యాఖ్య
- కడియం శ్రీహరి, ఆయన బిడ్డ కావ్యతో దీపాదాస్ మున్షీ భేటీ
- కాంగ్రెస్లోకి రావాలని ఆహ్వానం
- ఇయ్యాల ఇద్దరూ పార్టీలో చేరే చాన్స్
హైదరాబాద్, వెలుగు: కారణాలేవైనా రాష్ట్రంలో బీఆర్ఎస్పనైపోయిందని, పార్టీకి ప్రజలు దూరమవుతున్నారని బీఆర్ఎస్ఎమ్మెల్యే కడియం శ్రీహరి అన్నారు. ప్రజల మేలు కోసం, నియోజకవర్గ అభివృద్ధి కోసం ఏదో ఒక నిర్ణయం తీసుకోవాల్సిన సమయం వచ్చిందని చెప్పారు. ‘‘కాంగ్రెస్లో చేరాలని ఆ పార్టీ స్టేట్ఇన్ చార్జ్ దీపాదాస్మున్షీ ఆహ్వానించారు. నా సహచరులు, కార్యకర్తలతో చర్చించి నిర్ణయం తీసుకుంటాను. నేనింకా కాంగ్రెస్లో చేరలేదు. ఏ నిర్ణయమూ తీసుకోలేదు. నిర్ణయం తీసుకున్న తర్వాత కాంగ్రెస్తరఫున పోటీ చేసే విషయంపై తర్వాత చెప్తాను” అని తెలిపారు.
శుక్రవారం మినిస్టర్క్వార్టర్స్లో కడియం శ్రీహరి, ఆయన కూతురు కడియం కావ్యతో కాంగ్రెస్రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జ్ దీపాదాస్మున్షీ, ఏఐసీసీ సెక్రటరీలు రోహిత్చౌదరి, మల్లు రవి, సంపత్కుమార్ సమావేశమయ్యారు. కాంగ్రెస్లో చేరాలని వాళ్లిద్దరినీ ఆహ్వానించారు. కాగా, బీఆర్ఎస్వరంగల్ అభ్యర్థిగా పోటీ నుంచి తప్పుకుంటున్నానని కడియం కావ్య ఇప్పటికే ప్రకటించారు. బీఆర్ఎస్ కు రాజీనామా చేస్తున్నట్టు కేసీఆర్కు లేఖ రాశారు. ఈ నేపథ్యంలోనే శ్రీహరి, కావ్యతో కాంగ్రెస్ నేతలు సమావేశమయ్యారు. ఏఐసీసీ ఆదేశాల మేరకే కడియం ఫ్యామిలీని పార్టీలోకి ఆహ్వానించామని దీపాదాస్మున్షీ తెలిపారు. వారు ఎప్పుడు చేరుతారన్న దానిపై తాము కూడా కుతూహలంగా ఉన్నామన్నారు.
ఇయ్యాల చేరే చాన్స్..
కడియం శ్రీహరి, ఆయన కూతురు కావ్య శనివారం కాంగ్రెస్లో చేరే అవకాశాలు కనిపిస్తున్నాయి. నిజానికి శుక్రవారం ఉదయం సీఎం రేవంత్ రెడ్డితో శ్రీహరి, కావ్య భేటీ కావాల్సి ఉండగా.. దానికి ముందే దీపాదాస్మున్షీ కడియం ఇంటికి వెళ్లారు. పార్టీలోకి రావాలని ఆహ్వానించారు. కావ్యకు వరంగల్ఎంపీ టికెట్ఇచ్చేందుకు కాంగ్రెస్ హైకమాండ్ సానుకూలంగా ఉన్నట్టు తెలుస్తున్నది. ఇదే విషయాన్ని కడియం శ్రీహరికి దీపాదాస్మున్షీ చెప్పారని సమాచారం.