చిరంజీవి, కొరటాల కాంబినేషన్లో తెరకెక్కుతోన్న క్రేజీ ప్రాజెక్టు ‘ఆచార్య’లో హీరోయిన్ గురించి చాలా చర్చలు నడిచిన సంగతి తెలిసిందే. త్రిషని ఓకే చేసినా ఆమె తప్పుకోవడంతో కన్ఫ్యూజన్ మరింత పెరిగింది. దాంతో కాజల్ కానీ అనుష్క కానీ నటిస్తారనే వార్తలొచ్చాయి. చివరికి కాజలే కన్ఫర్మ్ అయ్యింది. ఆ విషయాన్ని ఆమే స్వయంగా ప్రకటించింది. కరోనా వైరస్ కారణంగా ఆదివారం దేశవ్యాప్తంగా తలపెట్టిన జనతా కర్ఫ్యూ నేపథ్యంలో ఇంట్లో ఖాళీగా ఉన్న కాజల్.. తన అభిమానులతో ఇన్స్టాగ్రామ్లో చాట్ చేసింది. ఈ సందర్భంగా మీ ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ ఏమిటని ఓ ఫ్యాన్ అడగగా… ‘చిరు సర్ ‘ఆచార్య’లో నటించబోతున్నా. కరోనా కారణంగా షూటింగులన్నీ ఆగిపోయాయి. తిరిగి ప్రారంభమయ్యాక చిరు సర్తో కలిసి నటిస్తాను’ అని చెప్పింది. దీంతో ‘ఆచార్య’లో ఎవరు నటిస్తారనే క్లారిటీ వచ్చేసింది. కొణిదెల ప్రొడక్షన్స్ బ్యానర్ పై రామ్ చరణ్ నిర్మిస్తున్న ఈ మూవీకి మణిశర్మ సంగీతం సమకూరుస్తున్నాడు. వంద రోజుల్లోపు షూటింగ్ పూర్తి చేసి సినిమాని రిలీజ్ చేద్దామనుకున్నారు చిరు. కానీ హీరోయిన్ మార్పు, కరోనా కారణంగా చిత్రీకరణ మరిన్ని రోజులు పట్టేటట్టు ఉంది. ఏదీ ఏమైనా చిరు, చరణ్, కొరటాల వంటి క్రేజీ కాంబోలో తెరకెక్కుతోన్న ఈ మూవీపై ఇప్పటికే భారీ అంచనాలు ఏర్పడ్డాయి. దానికి తోడు ‘ఖైదీ నెంబర్ 150’లో మురిపించిన ఈ జోడీ మరోసారి కనువిందు చేసేందుకు రెడీ కావడంతో ఆ అంచనాలు మరింత పెరగడం ఖాయం.
ఆచార్యలో కాజల్ కన్ఫర్మ్
- టాకీస్
- March 24, 2020
మరిన్ని వార్తలు
-
Vishal: నన్ను అణచివేయాలని చూస్తున్నారు.. హీరో విశాల్ సంచలన కామెంట్స్
-
Ravi teja, Anudeep: రవితేజ సినిమాకి మోహన్ బాబు టైటిల్.. ఈసారి మరింత క్రేజీగా వస్తున్న అనుదీప్
-
Rajinikanth Coolie: ఇదికదా సూపర్ స్టార్ రేంజ్ అంటే.. కూలీ కోసం టాప్ రెమ్యునరేషన్
-
Nagarjuna In Kubera: కుబేర మూవీ నుండి క్రేజీ న్యూస్.. ఆరేళ్ళ తర్వాత ఆపాత్రలో నాగార్జున
లేటెస్ట్
- Tesla Layoffs: టెస్లా షాక్.. 2 వేల 700 మంది ఉద్యోగులను తీసేసిన ఎలన్ మస్క్
- IPL 2024: ఎట్టకేలకు సాధించాడు: కోహ్లీ దగ్గర నుంచి బ్యాట్ సంపాదించిన రింకూ సింగ్
- ఒంటెపై వచ్చి.. నామినేషన్ వేసిన హైదరాబాద్ ఎంపీ అభ్యర్థి
- జగన్.. ఇక బ్యాండేజ్ తీసేయ్.. సునీత
- కోట్లకు పడగలెత్తిన దోమ వ్యాపారం ఇదే..
- April 25th World Malaria Day : మాయదారి మహమ్మారి.. మలేరియా
- SRH vs RCB: ఉప్పల్లో మ్యాచ్.. టాస్ గెలిచి బ్యాటింగ్ తీసుకున్న బెంగళూరు
- రామగుండం పోలీస్ కమిషనరేట్ లో.. సోషల్ మీడియా ట్రాకింగ్ సెంటర్
- ఫ్రీఫుడ్ వీడియో షేర్ చేశాడని..ఉద్యోగం నుంచి తీసేశారు
- Loksabha Elections: బంపర్ ఆఫర్.. ఓటేస్తే బీరు, దోశ, క్యాబ్ ఫ్రీ ఫ్రీ ఫ్రీ...
Most Read News
- చంద్రయాన్2 సక్సెస్ ఫుల్గా పనిచేస్తుంది..జపాన్ మూన్ ల్యాండర్ ఫొటోలు పంపింది
- కోహ్లీ కోసం..ఉప్పల్లో ఆర్సీబీతో సన్రైజర్స్ మ్యాచ్..అందరి ఫోకస్ విరాట్పైనే
- మలుపులో మెట్రో రైలు సౌండ్స్..భరించలేకపోతున్నాం
- DC vs GT: మోహిత్ శర్మను చితక్కొట్టిన పంత్.. ఐపీఎల్ చరిత్రలోనే చెత్త రికార్డ్
- శ్రీశైలం వెళ్లే భక్తులకు గుడ్ న్యూస్.. హైదరాబాద్ నుంచి గంటకో ఏసీ బస్సు
- ఆన్ లైన్ ట్రేడింగ్ వలలో మాజీ ఐఏఎస్.. ఏకంగా రూ. కోటి 87 లక్షలు పోగొట్టుకున్నారు
- Health Tips: రాత్రిపూట ఏ టైంలో స్నానం చేయాలో తెలుసా..
- ఏప్రిల్ 26న ఐటీ కారిడార్లో ట్రాఫిక్ ఆంక్షలు
- Telangana Special : ఇప్ప పువ్వు పూసింది.. గూడెం మురిసింది.. తెల్లవారుజామునే అడవిలో సందడి
- సుర్రు సమ్మర్.... ఎల్నినో ప్రభావం