ప్రతి ఏడాది 180 టీఎంసీలు నీరిస్తామని చెప్పిన గత ప్రభుత్వం .. ఏ ఏడాది కూడా ప్రతిపాదించిన నీటిని లిఫ్ట్ చేయలేదన్నారు. గత ఏడాది 62 టీఎంఎంసీల నీరు మాత్రమే ఎత్తిపోశారని సీఎం రేవంత్ అన్నారు. గత ఐదేళ్లలో మొత్తం కలిపి 162 టీఎంసీ నీళ్లను కూడా లిఫ్ట్ చేయలేదు. మేడిగడ్డ ప్రాజెక్ట్ కు గత ప్రభుత్వం చేసిన నిర్వాకాన్ని ప్రజలకు వివరించే ప్రయత్నం చేస్తున్నామన్నారు. ప్రాజెక్ట్ నిర్మాణంలో నాణ్యతా లోపం ఉందనే అనుమానాలు కలుగుతున్నాయని సీఎం రేవంత్ అన్నారు. మేడిగడ్డ ప్రాజెక్ట్ పిల్లర్లు నిలువునా చీలి ఐరన్ రాడ్లు బయటకు వచ్చాయన్నారు. అన్నారం.. సుందిళ్ల ప్రాజెక్ట్ల పరిస్థితి కూడా అంతంత మాత్రంగానే ఉందన్నారు. మేడిగడ్డ ప్రాజెక్ట్లో మొత్తం నీరు నింపితే ఏ పిల్లర్ కూడా ఉండదని సీఎం కేసీఆర్ అన్నారు. 2020 లోనే ఎల్అండ్ టీ నోటీసు ఇచ్చిందన్నారు.ప్రస్తుతం తాము అధికారంలో లేమని కేసీఆర్ చెబుతున్నారని.. అలానే ఎల్ అండ్ టీ సంస్థ కూడా మా అగ్రిమెంట్ గడువు ముగిసిందని చెపుతున్నారని సీఎం రేవంత్ అన్నారు.