‘ఒక దేశం ఒక భాష’పై కమల్​ ఫైర్

‘ఒక దేశం ఒక భాష’పై కమల్​ ఫైర్

చెన్నై: ‘‘మనదేశం రకరకాల రుచులతో కూడిన విందు భోజనం లాంటిది. దాన్ని అందరం కలిసే తినాలి. అలాకాదని ఒకే డిష్​ను అందరి నోళ్లలో బలవంతంగా కుక్కితే కక్కుకునే పరిస్థితి వస్తుంది”అంటూ హిందీని బలవంతంగా రుద్దడంపై నటుడు, ఎంఎన్​ఎం చీఫ్​ కమల్​ హాసన్ మండిపడ్డారు. భిన్నత్వంలో ఏకత్వం అనే ప్రామిస్​తోనే దేశం రిపబ్లిక్​గా ఏర్పడిందని, ఇప్పుడెవరో సుల్తాన్​ లేదా షా దాన్ని చెరిపేయలేరంటూ కేంద్ర మంత్రి అమిత్​ షాపై ఫైరయ్యారు. ఒక దేశం ఒక భాష విధానాన్ని వ్యతిరేకిస్తూ కమల్​ సోమవారం ఓ వీడియో మెసేజ్​ను రిలీజ్​ చేశారు.

‘‘బెంగాలీలో రాసినప్పటికీ జాతీయ గీతాన్ని  జనం సంతోషంగా పాడుకుంటారు. అన్ని భాషలు, సంస్కృతుల్ని గౌరవిస్తూ రవీంద్రనాథ్​ ఠాగూర్​ దాన్ని రాశారు. కలిసున్న దేశాన్ని భాష పేరుతో విభజించొద్దు. మూర్ఖంగా ఆలోచించే కొందరి వల్ల జనం ఇబ్బందులు పడొద్దు. అసలు కేంద్రం భాషలు, సంస్కృతుల జోలికేరావొద్దు. ఒకవేళ హిందీని బలవంతంగా రుద్దితే జల్లికట్టును మించిన మహోద్యమాన్ని చూడాల్సిఉంటుంది’’అని కమల్​ చెప్పారు. కామన్​ లాంగ్వేజ్​ ఉండాలని, ప్రజల్ని ఒక్కటిచేసేది హిందీ భాషేనని హిందీ దివస్​ సందర్భంగా కేంద్ర మంత్రి అమిత్ షా చేసిన కామెంట్స్​ వివాదాస్పదమయ్యాయి. సౌత్​లోని అన్ని పార్టీలూ మంత్రి ప్రపోజల్​ను ఖండించాయి.