డిసెంబర్ చివరిలోగా సీఎంఆర్​ కంప్లీట్ ​చేయాలి : కలెక్టర్​ జితేశ్​ వీ పాటిల్​

డిసెంబర్ చివరిలోగా సీఎంఆర్​ కంప్లీట్ ​చేయాలి : కలెక్టర్​ జితేశ్​ వీ పాటిల్​
  •     కలెక్టర్​ జితేశ్​ వీ పాటిల్​

కామారెడ్డి, వెలుగు : ఎఫ్​సీఐకి కేటాయించిన కస్టమ్ ​మిల్లింగ్ ​రైస్​(సీఎంఆర్)ను ఈ నెలాఖరులోగా కంప్లీట్ ​చేయాలని రైస్​మిల్లర్లకు కామారెడ్డి కలెక్టర్ ​జితేశ్ ​వీ పాటిల్​ ఆదేశించారు. గురువారం ఆయన  కలెక్టరేట్​లో మిల్లర్లతో మీటింగ్​ నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్​ మాట్లాడుతూ..

సీఎంఆర్ ​టార్గెట్​ను కంప్లీట్​ చేయని మిల్లులను బ్లాక్​లిస్ట్​లో పెట్టడమే కాకుండా, చర్యలు తీసుకుంటామన్నారు. పోటీతత్వంతో మిల్లర్లు  సీఎంఆర్​ కంప్లీట్​చేయాలన్నారు. డీఎస్వో మల్లికార్జున్​బాబు, సివిల్​సప్లయ్​డీఎం  అభిషేక్​సింగ్, ఆఫీసర్లు, రైస్​మిల్​ అసోసియేషన్ ​ప్రతినిధులు పాల్గొన్నారు.