రోడ్డు ప్రమాదాలను నివారించాలి : కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్

రోడ్డు ప్రమాదాలను నివారించాలి : కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్

కామారెడ్డిటౌన్, వెలుగు : రోడ్డు ప్రమాదాలను నివారించాలని, ఇందుకు ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని కలెక్టర్ ​ఆశిష్​ సంగ్వాన్​ తెలిపారు. గురువారం రోడ్డు భద్రతా మాసోత్సవాల్లో భాగంగా  జిల్లా కేంద్రంలో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. విద్యార్థులతో ర్యాలీ నిర్వహించిన అనంతరం కలెక్టర్, ఎస్పీ రాజేశ్​చంద్ర, సీనియర్​ సివిల్ జడ్జి నాగరాణి విద్యార్థులతో ప్రతిజ్ఞ చేయించారు.

ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ నిర్లక్ష్యంగా డ్రైవింగ్​ చేయొద్దన్నారు. ట్రాఫిక్​ రూల్స్ పాటించేలా విద్యార్థులు తల్లిదండ్రులకు అవగాహన కల్పించాలన్నారు.  జిల్లా రవాణా శాఖ అధికారి జె. శ్రీనివాస్​, రవాణా శాఖ , పోలీసు శాఖ అధికారులు పాల్గొన్నారు.