కామారెడ్డిటౌన్, వెలుగు : కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ చొరవతో జిల్లా కేంద్రంలోని బాల సదనం విద్యార్థులు విహార యాత్రకు వెళ్లారు. 65 మంది అనాథ పిల్లలు కామారెడ్డి బాల సదనంలో
ఉంటున్నారు. సెలవుల దృష్ట్యా వీరిని కలెక్టర్ విజ్ఞాన యాత్రకు పంపారు.
హైదరాబాద్లోని సాలర్జంగ్ మ్యూజియంలోని పురాతన వస్తువులు, శిల్ప కళా నమూనాలను విద్యార్థులు
పరిశీలించారు. ఇలాంటి విహార యాత్రలు పిల్లల్లో విజ్ఞానాన్ని పెంపొందిస్తాయని కలెక్టర్ పేర్కొన్నారు. భవిష్యత్లో ఇలాంటి కార్యక్రమాలను మరింతగా ప్రోత్సహిస్తామని తెలిపారు.
