ఆకట్టుకుంటున్న కంగనా 'ఎమర్జెన్సీ' టీజర్

ఆకట్టుకుంటున్న కంగనా 'ఎమర్జెన్సీ' టీజర్

బాలీవుడ్ క్వీన్ కంగనా రనౌత్(Kangana Ranaut) ప్రధాన పాత్రలో ఎమర్జెన్సీ(Emergency) అనే మూవీ తెరకెక్కుతోంది. ఎన్నో ఒడిదుడుకుల మధ్య ప్రేక్షకుల ముందుకు వస్తున్న ఈ సినిమా నుండి.. తాజాగా టీజర్ రిలీజ్ చేశారు మేకర్స్. ఈ టీజర్ లో కంగనా రౌనత్ చెప్పిన.."దేశాన్ని కాపాడాల్సిన బాధ్యత నా చేతుల్లో ఉంది.. ఎందుకంటే భారత్ అంటే ఇందిరా, ఇందిరా అంటే భారత్" అనే డైలాగ్ ఆడియన్స్ ను విపరీతంగా ఆకట్టుకుంటోంది. ఈ టీజర్ లో కంగనా అచ్చం ఇందిరా గాంధీలా కనిపించడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. 

1977లో ఇందిరా గాంధీ(Indira Gandhi) భారత ప్రధానిగా ఉన్నప్పుడు దేశంలో ఎమర్జెన్సీ విధించిన విషయం తెలిసేందే. ఆ టైంలో ఎటువంటి పరిణామాలు చోటుచేసుకున్నాయి, అసలు ఎమర్జెన్సీ ఎందుకు విధించారు? అనే అంశాలతో ఎమర్జెన్సీ మూవీని తెరకెక్కించారు మేకర్స్. ఈ సినిమా నవంబర్ 24న ప్రేక్షకుల ముందుకు రానుంది.  

ఇక్కడ మరో విశేషం ఏంటంటే.. కంగనా రనౌత్ ఈ సినిమాను డైరెక్ట్ చేయడంతో పాటు ప్రొడ్యూసర్ గా కూడా వ్యవహరించింది. అంతేకాదు  ఈ మూవీ కోసం తన ఆస్తులని సైతం తాకట్టుపెట్టిందట కంగనా. మరి టీజర్ తోనే అందరి దృష్టిని ఆకర్శించిన ఈ మూవీకి.. రిలీజ్ తరువాత ఎలాంటి రిజల్ట్ వస్తుందో చూడాలి.

ALSO READ:నందమూరి హీరో సాలిడ్ ఎంట్రీ.. ఆసక్తి రేపుతున్న 'బ్రీత్’ టీజర్