పెళ్లింట తీవ్ర విషాదం నెలకొంది. హఠాత్తుగా పెళ్లికూతురు మృతి చెందింది. రిసెప్షన్ లోనే నవ వధువు చనిపోయింది. వివరాల్లోకి వెళ్తే.. కర్నాటకలోని శ్రీనివాసపురంకు చెందిన రామప్ప కుమార్తె చైత్ర (26) కైవార కాలేజీలో లెక్చరర్ గా ఉద్యోగం చేస్తోంది. ఈ క్రమంలో ఆమెకు పెద్దలు పెళ్లి ఫిక్స్ చేశారు. హొసకోటకు చెందిన యువకుడితో చైత్రకు పెళ్లి నిశ్చయమైంది. ఈ నెల 6వ తేదీన వీరి వివాహం శ్రీనివాసపురంలో జరగాల్సివుంది. అయితే పెళ్లి రిసెప్షన్ జరుగుతున్న సమయంలోనే పెళ్లి కూతురు ఒక్కసారిగా కుప్పకూలిపోయింది.
దీంతో వెంటనే ఆమెను కుటుంబసభ్యులు ఆస్పత్రికి తరలించారు. చికిత్స నిమిత్తం బెంగుళూరులోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. ఆరు రోజులుగా చికిత్స పొందుతున్న ఆమె బ్రెయిన్ డెడ్ అయిందని డాక్టర్లు చెప్పడంతో తల్లిదండ్రులు ఒక్కసారిగా షాక్ తిన్నారు. ఆమె మృతితో ఆ కుటుంబంలో విషాదఛాయలు అలుముకున్నాయి. కుటుంబ సభ్యులు, బంధువులు కన్నీరుమున్నీరయ్యారు. అయితే వైద్యుల విజ్ఞప్తి మేరకు అవయదానం చేసి తల్లిదండ్రులు మానవత్వాన్ని చాటుకున్నారు.
The parents of a girl in #Karnataka, who collapsed on stage during her wedding reception and was later declared brain dead, have donated her organs, a move appreciated by the state's Health Minister K. Sudhakar (@mla_sudhakar). pic.twitter.com/6qZsBvw2sS
— IANS Tweets (@ians_india) February 12, 2022
ఇవి కూడా చదవండి:
నిన్న సీఎం సోయి లేకుండా మాట్లాడిండు
మేడారం జాతరపై కేంద్రం కీలక ప్రకటన