లోకల్​ లాంగ్వేజ్​ను బ్యాంకు ఉద్యోగులు గౌరవించాలి : సీఎం సిద్ధరామయ్య

లోకల్​ లాంగ్వేజ్​ను బ్యాంకు ఉద్యోగులు గౌరవించాలి : సీఎం సిద్ధరామయ్య
  • కస్టమర్​తోమేనేజర్​  ప్రవర్తించిన తీరు సరిగ్గా లేదు: సిద్ధరామయ్య

బెంగళూరు: కర్నాటక ఎస్​బీఐలో నెలకొన్న కన్నడ వివాదంపై ఆ రాష్ట్ర సీఎం సిద్ధరామయ్య స్పందించారు. కస్టమర్లతో బ్యాంకు మేనేజర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌  నిర్లక్ష్యంగా ప్రవర్తించడం సరైంది కాదని అన్నారు.  లోకల్​ లాంగ్వేజ్​ను బ్యాంకు ఉద్యోగులందరూ తప్పనిసరిగా గౌరవించాలని, కస్టమర్లతో స్థానిక భాషలోనే మర్యాదగా మాట్లాడాలని సూచించారు. అనేకల్​తాలూకాలోని సూర్యనగర ఎస్​బీఐ బ్రాంచ్​లో  కన్నడ మాట్లాడటానికి నిరాకరించిన ఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌బీఐ మేనేజర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా మారగా.. బుధవారం ‘ఎక్స్’ వేదికగా సిద్ధరామయ్య స్పందించారు. ఆ మేనేజర్​ను ఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌బీఐ వెంటనే బదిలీ చేసిందని.. ఇంతటితో ఈ సమస్య సద్దుమణిగినట్లుగా భావిస్తున్నామని తెలిపారు. 

ఇలాంటివి రిపీట్​ కాకుండా చూడాలి 

సూర్యనగర ఎస్​బీఐ బ్రాంచ్​లో జరిగిన భాషా వివాదం ఘటనలాంటివి మళ్లీ పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని అధికారులకు సిద్ధ రామయ్య సూచించారు. దేశంలోని అన్ని బ్యాంకుల సిబ్బందికి ఆయా ప్రాంతాల సంస్కృతి, భాష వంటి విషయాల్లో ట్రైనింగ్​ ఇవ్వాలని కేంద్ర ఆర్థిక సేవల విభాగాన్ని కోరారు. స్థానిక భాషను గౌరవించడం అంటే ప్రజలను గౌరవించడం అని చెప్పారు. ‘కన్నడ ఫస్ట్’​అనే హ్యాష్​ట్యాగ్​ను పోస్ట్​కు జోడించారు. దేశంలో భాషా వివాదం కొనసాగుతున్న వేళ ఇలాంటి ఘటనలతో ఉద్రిక్తతలు మరింత పెరిగే అవకాశం ఉందని అన్నారు. కస్టమర్​తో దురుసుగా ప్రవర్తించిన మేనేజర్​ను బదిలీ చేయడంపై ఎస్​బీఐను ప్రశంసించారు. సరైన సమయంలో మంచి నిర్ణయం తీసుకున్నారని అన్నారు.