నా కెరీర్ లో బిగ్ బడ్జెట్ చిత్రమిది: హీరో కార్తి

నా కెరీర్ లో బిగ్ బడ్జెట్ చిత్రమిది: హీరో కార్తి

"నన్ను ఎంతగానో ప్రేమిస్తున్న తెలుగు ప్రేక్షకులకు కృతజ్ఞతలు. నాగార్జున గారు సర్దార్ ఈవెంట్ కి రావడం ఆనందంగా ఉంది" అని హీరో కార్తి అన్నాడు. హీరో కార్తి లేటెస్ట్ గా నటించిన మూవీ 'సర్దార్'. ఇందులో కార్తి సరసన రాశి ఖన్నా, రజిషా విజయన్ కథానాయికలు నటించారు. అన్నపూర్ణ స్టూడియోస్ ఈ సినిమాని తెలుగు రాష్ట్రాలలో భారీగా విడుదల చేస్తోంది. అక్టోబర్ 21న ఈ చిత్రం తెలుగు, తమిళ భాషల్లో విడుదల కానుంది. ఈ నేపథ్యంలో చిత్ర ప్రీరిలీజ్ ఈవెంట్ గ్రాండ్ నిర్వహించారు. ఈ వేడుకకు కింగ్ అక్కినేని నాగార్జున ముఖ్య అతిధిగా విచ్చేశారు.

ఈ సందర్భంగా హీరో కార్తి మాట్లాడుతూ.. "ఈ సినిమాని నాగార్జున అన్నయ్య తెలుగులో విడుదల చేయడం చాలా థ్రిల్ గా ఉంది. సర్దార్ నా కెరీర్ లో చాలా స్పెషల్ మూవీ. తొలిసారి తండ్రి కొడుకులుగా నటించాను. ఇందులో స్పై పాత్ర చాలా స్పెషల్. సర్దార్ గ్రేట్ హీరో. ఏమీ ఆశించకుండా దేశం కోసం పని చేసిన హీరో. ఆ పాత్ర చేసినప్పుడు చాలా గర్వంగా ఫీలయ్యాను. పోలీస్ క్యారెక్టర్ విషయానికి వస్తే ఈ జనరేషన్ కు తగ్గట్టుగా ఉంటుంది. ఒక సినిమాలో రెండు జనరేషన్లు చూపించడం ఒక సవాల్. ఇది ఇండియన్ స్పై థ్రిల్లర్. అభిమన్యుడు ఫేం పిఎస్ మిత్రన్ ఈ చిత్రాన్ని అద్భుతంగా తీశారు. 

అభిమన్యుడులో డిజిటల్ క్రైమ్ ని ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చినట్లే ఇందులో కూడా మన కళ్ళ ముందు ఉండి, మనం పెద్దగా పట్టించుకొని ఒక ముఖ్యమైన విషయాన్ని చూపించారు. సర్దార్ లో అది గొప్ప సర్ ప్రైజ్ గా ఉంటుంది. రాశి ఖన్నా, రజీషా, లైలా అద్భుతంగా నటించారు. జార్జ్ కెమరా పనితనం బ్రిలియంట్ గా ఉంటుంది. జీవి పప్రకాష్ కుమార్ చాలా అద్భుతమైన మ్యూజిక్ ఇచ్చారు. నిర్మాత లక్ష్మణ్ కి కృతజ్ఞతలు. నా కెరీర్ లో బిగ్ బడ్జెట్ చిత్రమిది. దాదాపు పాన్ ఇండియా షూట్ చేశాం. దీపావళికి ఖైదీ సినిమా వచ్చింది. ఈ దీపావళికి ఒక పండగలా.. క్రాకర్ లా సర్దార్ సినిమా రాబోతుంది. అక్టోబర్ 21న సర్దార్ వస్తోంది. అందరూ తప్పకుండా థియేటర్ లో చూసి ఎంజాయ్ చేయాలి" అని కార్తి కోరారు. కాగా, ఈ వేడుకలో కార్తి చిత్రంలోని 'నేనే సేనాపతి' పాటకు వేదికపై మాస్ డ్యాన్స్ చేయడం అందరినీ అలరించింది.