కామారెడ్డిలో గెలిచేది బీజేపీయే : కాటిపల్లి వెంటకరమణారెడ్డి

కామారెడ్డిలో గెలిచేది బీజేపీయే : కాటిపల్లి వెంటకరమణారెడ్డి

కామారెడ్డి టౌన్, వెలుగు :  బీఆర్ఎస్​ వంద మంది ఓటర్లకు ఒక ఇన్​చార్జి బదులు ఓటుకు ఒక ఇన్​చార్జి పెట్టినా కామారెడ్డిలో బీజేపీ గెలుస్తుందని ఆ పార్టీ అభ్యర్థి కాటిపల్లి వెంటకరమణారెడ్డి పేర్కొన్నారు. మంగళవారం బీబీపేట మండల కేంద్రానికి చెందిన పలువురు వెంకట రమణారెడ్డి సమక్షంలో బీజేపీలో చేరారు.

ఆయన మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వ పథకాలను బీఆర్ఎస్​ లీడర్లు తమ పథకాలుగా చెప్పుకుంటున్నారన్నారు.