
- అరెస్ట్.. విడుదల
ముషీరాబాద్, వెలుగు: పెంచిన స్టూడెంట్ల బస్పాస్ చార్జీలను వెంటనే ఉపసంహరించుకోవాలని ఎమ్మెల్సీ కవిత డిమాండ్ చేశారు. తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో మంగళవారం హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్ లోని బస్ భవన్ ఎదుట ఆమె నిరసన తెలిపారు. కవిత మాట్లాడుతూ బస్ పాస్ చార్జీల పెంపుతో ఒక్కొక్కరిపై నెలకు దాదాపు రూ. 300 పైగా భారం పెడుతుందన్నారు. విద్యార్థులు, చిరుద్యోగులపై ఆర్థిక భారం పడుతుందని నిర్ణయాన్ని ఉపసంహరించుకోవలన్నారు. దీంతో పోలీసులు కవితను అరెస్టు చేసి చాంద్రాయణగుట్ట పీఎస్కు ఆ తర్వాత కంచన్ బాగ్ పోలీస్ స్టేషన్కు తరలించారు. కొద్దిసేపటి తర్వాత వదిలేశారు.