బస్ పాస్ చార్జీలను తగ్గించాలంటూ బస్ భవన్ ఎదుట కవిత ధర్నా

బస్ పాస్ చార్జీలను తగ్గించాలంటూ బస్ భవన్ ఎదుట కవిత ధర్నా
  • అరెస్ట్​.. విడుదల 

ముషీరాబాద్, వెలుగు: పెంచిన స్టూడెంట్ల బస్​పాస్​ చార్జీలను వెంటనే ఉపసంహరించుకోవాలని ఎమ్మెల్సీ కవిత డిమాండ్​ చేశారు. తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో మంగళవారం హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్ లోని బస్​ భవన్​ ఎదుట ఆమె నిరసన తెలిపారు. కవిత మాట్లాడుతూ బస్​ పాస్​ చార్జీల పెంపుతో ఒక్కొక్కరిపై నెలకు దాదాపు రూ. 300 పైగా భారం పెడుతుందన్నారు. విద్యార్థులు, చిరుద్యోగులపై ఆర్థిక భారం పడుతుందని నిర్ణయాన్ని ఉపసంహరించుకోవలన్నారు. దీంతో పోలీసులు కవితను అరెస్టు చేసి చాంద్రాయణగుట్ట పీఎస్​కు ఆ తర్వాత కంచన్​ బాగ్ ​పోలీస్ స్టేషన్​కు తరలించారు. కొద్దిసేపటి తర్వాత వదిలేశారు.