- బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్
రంగారెడ్డి జిల్లా: కృష్ణా నది నీళ్లలో మనకు దక్కాల్సిన వాటా దక్కకపోవడానికి సీఎం కేసీఆర్ కారణమన్నారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్. 500లకు పైగా టీఎంసీలు నీళ్లు తెలంగాణకు రావాల్సి ఉండగా..కేవలం 299టీఎంసీలకు కేసీఆర్ ఎందుకు ఒప్పుకున్నారని ఆయన ప్రశ్నించారు. బండి సంజయ్ చేస్తున్న ప్రజా సంగ్రామ యాత్ర ఇవాళ ఉదయం రంగారెడ్డి జిల్లాకు చేరుకుంది. షాద్ నగర్ నియోజకవర్గం తొమ్మిది రేకుల గ్రామం దగ్గర బండి సంజయ్ కు .. ఘన స్వాగతం పలికారు పార్టీ నాయకులు, కార్యకర్తలు. తర్వాత గ్రామంలోని ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు బండి సంజయ్.
ఇవి కూడా చదవండి
కాంగ్రెస్, బీజేపీ ఒక్కటై రాష్ట్రాన్ని ఇబ్బంది పెడుతున్నాయి
సంక్షేమ పథకాలకు డబ్బుల్లేవు.. కానీ కమీషన్ల కాళేశ్వరానికి కొదవలేదు
కోనాపూర్ కు ఏమడిగితే అదివ్వాలని కేసీఆర్ అన్నరు