అనారోగ్యంతో మృతి చెందిన యూపీ మాజీ సీఎం ములాయం సింగ్ యాదవ్ పార్థివదేహానికి సీఎం కేసీఆర్ నివాళి అర్పించారు. మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, ఎమ్మెల్సీ కవిత, ఎంపీ సంతోష్ కుమార్ లతో కలిసి ములాయం స్వస్థలం సైఫాయ్ వెళ్లి ములాయం పార్థివ దేహానికి నివాళి అర్పించారు. ములాయం కుమారుడు అఖిలేష్ యాదవ్ తో పాటు ఇతర కుటుంబ సభ్యులను కలిసి పరామర్శించి సానుభూతి తెలిపారు. కాసేపట్ల జరగనున్న ములాయం అంత్యక్రియల్లో సీఎం కేసీఆర్ పాల్గొననున్నారు.
ములాయం అంత్యక్రియలు ముగిసిన తర్వాత కేసీఆర్ ఇవాళ సాయంత్రం ఢిల్లీకి వెళ్తారు. రెండు మూడు రోజుల పాటు కేసీఆర్ ఢిల్లీలోనే ఉండనున్నట్లు తెలుస్తోంది. టీఆర్ఎస్ ను బీఆర్ఎస్ మార్చిన సందర్భంగా అక్కడ పలువురు జాతీయ నాయకులతో కేసీఆర్ భేటీ కానున్నట్లు తెలుస్తోంది.