
నాలుగు పవిత్ర ధామాల్లో ఒకటైన కేధార్ నాథ్ ఇవాళ తెరచుకుంది. మంచు సీజన్ కారణంగా 2020 డిసెంబర్ 16న ఆలయాన్ని మూసేశారు. సీజన్ పూర్తి కావడంతో ఈ ఉదయం 5గంటలకు ఆలయాన్ని తెరిచారు పూజారులు, అధికారులు. ఛార్ ధామ్ లో భాగమైన గంగోత్రి, యమునోత్రి ఆలయాలు ఈ నెల 14నే ఓపెన్ అయ్యాయి. కేదార్ నాథ్ ఆలయ ప్రారంభానికి ముందు నిన్న డోలీ ఉత్సవం నిర్వహించారు. రేపు తెల్లవారు జామున బద్రీనాథ్ ఆలయాన్ని కూడా తెరవనున్నారు. ఉదయం 4గంటల 15 నిమిషాలకు బ్రహ్మీ ముహూర్తంలో బద్రీనాథ్ తెరచుకోనుంది.
#WATCH | Opening ceremony of portals of Kedarnath temple, Uttarakhand pic.twitter.com/qW3XiCjDjV
— ANI (@ANI) May 17, 2021
ఆలయాలు తెరిచినప్పటికీ... ఛార్ ధామ్ యాత్రను ఉత్తరాఖండ్ ప్రభుత్వం క్యాన్సిల్ చేసింది. కరోనా కారణంగా యాత్రను సస్పెండ్ చేసినట్టు తెలిపింది. భక్తులను అనుమతించేదిలేదని స్పష్టం చేసింది. ఆలయాల్లో పూజలు, ఇతర కార్యక్రమాలు కొనసాగుతాయని క్లారిటీ ఇచ్చింది. కేధార్ నాథ్ ఆలయం తెరవడంపై ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి తీరత్ సింగ్ రావత్ ట్వీట్ చేశారు. ప్రజలందరినీ ఆరోగ్యంగా ఉంచాలని కేదారీశ్వరుడిని ప్రార్థిస్తున్నట్టు చెప్పారు.