మాస్క్​కు మైక్​ పెట్టిన బీటెక్​ స్టూడెంట్

మాస్క్​కు మైక్​ పెట్టిన బీటెక్​ స్టూడెంట్

కరోనా మొదలయ్యాక మాస్క్ మస్ట్​ అయింది. మాస్క్ పెట్టుకొని మాట్లాడితే అవతలి వాళ్లకు ఒక్కోసారి సరిగ్గా వినిపించదు కూడా. ముఖ్యంగా డాక్టర్లు కరోనా పేషెంట్లతో  మాట్లాడి, వాళ్ల ఆరోగ్యం ఎలా ఉందో తెలుసుకోవడం లేయర్డ్​ మాస్క్, ఫేస్​షీల్డ్ వల్ల కష్టంగా ఉంటుంది. డాక్టర్లకు ఈ ఇబ్బంది లేకుండా మైక్, స్పీకర్​ ఉన్న మాస్క్ తయారుచేశాడు కేరళలోని త్రిస్సూర్​ బీటెక్​ స్టూడెంట్​ కెవిన్​ జాకబ్​.

జాకబ్​ తల్లిదండ్రులిద్దరూ డాక్టర్లు. మాస్క్​ పెట్టుకొని కరోనా పేషెంట్లతో మాట్లాడేందుకు వాళ్లు ఎంత ఇబ్బంది  పడుతున్నారో గమనించాడు. ‘‘మా పేరెంట్స్ కొవిడ్ సోకిన వాళ్ల పరిస్థితి తెలుసుకునేందుకు కిందటి ఏడాది నుంచి కష్టపడుతున్నారు. అప్పుడే నాకు మైక్, స్పీకర్​ ఉన్న ఫేస్​మాస్క్ తయారు చేయాలనే ఐడియా వచ్చింది. అయస్కాంతం సాయంతో మైక్, స్పీకర్​ను మాస్క్​కు అటాచ్​ చేశాను. ఈ మాస్క్​ను అరగంట చార్జ్​ చేస్తే చాలు నాలుగు నుంచి ఆరుగంటలు పనిచేస్తుంది’’  అని చెప్పాడు జాకబ్. మొదట తన పేరెంట్స్​కు  ఈ మాస్క్​ ఇచ్చి, అది చక్కగా పనిచేస్తుందో లేదో టెస్ట్​ చేశాడు. అది బాగా పనిచేయడంతో ఇప్పటివరకు 50 మాస్క్​లు తయారుచేశాడు. 

జాకబ్​ తయారుచేసిన మైక్​, స్పీకర్​ మాస్క్​ తమకు బాగా ఉపయోగపడుతోందని, కరోనా పేషెంట్స్​తో మాట్లాడేటప్పుడు ఏ ఇబ్బంది లేదని  కొందరు డాక్టర్లు ఫీడ్ బ్యాక్​ కూడా ఇచ్చారు. ​

అంతేకాదు కంపెనీలు ముందుకొస్తే ఎక్కువ సంఖ్యలో ఇలాంటి మాస్క్​లను తయారుచేయాలనే ఆలోచనలో ఉన్నాడు ఈ యంగ్​ ఇన్వెంటర్​ జాకబ్.