
ఖమ్మం కార్పొరేషన్, వెలుగు : దేశవ్యాప్తంగా 10 జిల్లాల్లో ప్రారంభమైన డిజిటల్ఇండియా కామన్ సర్వీస్ సెంటర్ ప్రాజెక్ట్లో ఖమ్మం జిల్లా పైలెట్ప్రాజెక్ట్గా ఎంపికైంది. ఈ ప్రాజెక్టు ద్వారా 137 మంది స్వయం సహాయక సంఘాల మహిళలు ఎంపికయ్యారని జిల్లా గ్రామీణ అభివృద్ధి అధికారి సన్యాసయ్య తెలిపారు. శుక్రవారం కలెక్టరేట్కు వచ్చిన మహిళలో ఆయన మాట్లాడి వారి అభిప్రాయాలు తెలుసుకున్నారు. సెర్ఫ్, సీఎస్సీ కలిసి జిల్లాలోని నిరుద్యోగ మహిళలకు మోడల్ సీఎస్సీ కేంద్రాలు స్థాపించేందుకు అవకాశం కల్పిస్తున్నాయని ఆయన తెలిపారు.
ఈ కేంద్రాలు రాజీవ్ యువ వికాసం, డీఐసీఎస్సీ ద్వారా మంజూరవుతాయని చెప్పారు. ఈ కార్యక్రమంలో డీఐసీఎస్సీ రాష్ట్ర ఇన్చార్జి హరికృష్ణ కుమార్, సీఎస్సీ జిల్లా కో-ఆర్డినేటర్ ఫయాజ్, జిల్లా మేనేజర్ సురేశ్, గ్రామీణ స్వయం ఉపాధి శిక్షణా సంస్థలో వ్యాపార శిక్షణ పొందిన 70 మంది మహిళలు ఉన్నారు.