ఖమ్మంలో డ్రైనేజ్ పనులు స్పీడప్ ​చేయాలి : కేఎంసీ కమిషనర్​ అభిషేక్ అగస్త్య

ఖమ్మంలో డ్రైనేజ్ పనులు స్పీడప్ ​చేయాలి : కేఎంసీ కమిషనర్​ అభిషేక్ అగస్త్య

ఖమ్మం కార్పొరేషన్, వెలుగు :  వచ్చే వర్షాకాలాన్ని దృష్టిలో ఉంచుకొని ఖమ్మం నగర ప్రజలకు అసౌకర్యం కలగకుండా, నాణ్యమైన ప్రమాణాలను పాటిస్తూ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ నిర్మాణ పనులను స్పీడప్​ చేసి త్వరగా కంప్లీట్​ చేయాలని కేఎంసీ కమిషనర్​ అభిషేక్​ అగస్త్య అధికారులను ఆదేశించారు. బుధవారం నగరంలోని వివిధ వార్డుల్లో నిర్మాణంలో ఉన్న అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ వ్యవస్థ పనులను అధికారులతో కలిసి ఆయన పరిశీలించారు. 

ఈ సందర్భంగా మాట్లాడుతూ నగరంలో నీటి నిల్వ, కాలువలలో జమయ్యే చెత్త లాంటి సమస్యల నివారణకు అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ వ్యవస్థ కీలకమైందని తెలిపారు. అభివృద్ధి పనుల్లో పారదర్శకత, వేగం, నాణ్యత ఉండాలన్నారు. అవసరమైతే మానిటరింగ్ మెకానిజాన్ని మరింత బలోపేతం చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో నగర పాలక సంస్థ ఇంజినీరింగ్ అధికారులు పాల్గొన్నారు.