కరోనా బారిన పడిన మరో సెలబ్రిటీ

కరోనా బారిన పడిన మరో సెలబ్రిటీ

చెన్నై: దేశంలో కరోనా విజృంభణ మళ్లీ మొదలైంది. రోజురోజుకీ భారత్ లో కొవిడ్ కేసులు భారీగా నమోదవుతున్నాయి. ఆదివారం ఒక్కరోజే 1.79 లక్షలకు పైగా కేసులు నమోదవ్వడాన్ని బట్టి వైరస్ విజృంభణ ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఒమిక్రాన్ కేసులు కూడా 4 వేలు దాటాయి. సాధారణ ప్రజల దగ్గర్నుంచి సెలబ్రిటీల దాకా అందర్నీ కరోనా కలవరపెడుతోంది. గత కొద్ది రోజుల్లో చాలా మంది సినీ ప్రముఖలు వైరస్ బారిన పడ్డారు. తమిళ ఫిల్మ్ ఇండస్ట్రీలోనూ కరోనా కేసులు పెరుగుతున్నాయి. రీసెంట్ గా వెటరన్ నటుడు, కట్టప్ప పాత్రతో దేశవ్యాప్తంగా క్రేజ్ సంపాదించిన సత్యారాజ్ కు కొవిడ్ సోకగా.. తాజాగా సీనియర్ హీరోయిన్, బీజేపీ నేత ఖుష్బూ సుందర్ వైరస్ పాజిటివ్ గా తేలారు. ఈ విషయాన్ని స్వయంగా ఖుష్బూ తన ట్విట్టర్ హ్యాండిల్ ద్వారా వెల్లడించారు. గత రెండు వేవ్స్ సమయంలో కరోనా నుంచి తప్పించుకున్నప్పటికీ.. ఇప్పుడు మాత్రం వైరస్ కు చిక్కానన్నారు. జలుబుతో బాధపడుతున్నానని చెప్పారు. ప్రస్తుతం ఐసోలేషన్ లో ఉన్నానని.. ఒంటరిగా ఉండటం తనకు నచ్చడం లేదన్నారు. కాబట్టి తనను ఎంటర్ టైన్ చేయాలని ఫ్యాన్స్ ను కోరారు. 

మరిన్ని వార్తల కోసం: 

రాష్ట్రాన్ని కేసీఆర్ చావుల కాష్టంగా తయారు చేసిండు

మోడీ భద్రతా వైఫల్యంపై అన్ని ఎంక్వైరీలు ఆపేయండి

ప్రభుత్వాసుపత్రుల్లో భారీగా ఆక్సిజన్ ప్లాంట్లు