
న్యూఢిల్లీ : కిడ్నీ కేర్ ప్రొవైడర్ నెఫ్రోకేర్ ఇండియా ఐపీఓ ఈ నెల 28న మొదలై జులై రెండో తేదీన ముగుస్తుంది. ఒక్కో షేరు ధరను రూ. 85–-90గా నిర్ణయించారు. యాంకర్ ఇన్వెస్టర్ల బిడ్డింగ్ జూన్ 27న ఉంటుందని తెలిపింది. ఐపీఓ ప్రైస్ బ్యాండ్ ఎగువ ముగింపులో రూ. 41.26 కోట్ల విలువైన 45.84 లక్షల ఈక్విటీ షేర్లను తాజాగా జారీ చేసింది.
ఇష్యూ తర్వాత, కంపెనీ షేర్లు ఎన్ఎస్ఈ ఎమర్జ్ ప్లాట్ఫారమ్లో లిస్ట్ అవుతాయి. ఐపీఓ ద్వారా వచ్చిన డబ్బును ఆస్పత్రుల నిర్మాణానికి వాడుతామని నెఫ్రో కేర్ తెలిపింది. కంపెనీ 2023–-24 ఆర్థిక సంవత్సరం మొదటి తొమ్మిది నెలల్లో రూ. 19.75 కోట్ల ఆదాయాన్ని, రూ. 3.4 కోట్ల లాభాన్ని ఆర్జించింది.