Periodic Crime: కత్తితో జీవించేవాడు కత్తితోనే చనిపోతాడు.. ఆసక్తిగా కింగ్ జాకీ క్వీన్‌ టీజర్‌‌‌‌

Periodic Crime: కత్తితో జీవించేవాడు కత్తితోనే చనిపోతాడు.. ఆసక్తిగా కింగ్ జాకీ క్వీన్‌ టీజర్‌‌‌‌

‘దసరా’ఫేమ్ దీక్షిత్ శెట్టి, శశి ఓదెల, యుక్తి తరేజ లీడ్ రోల్స్‌‌లో కేకే దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘కేజేక్యూ –కింగ్ జాకీ క్వీన్‌‌’.సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్నారు. బుధవారం ఈ మూవీ టీజర్‌‌‌‌ను హీరో నాని లాంచ్ చేసి బెస్ట్ విషెస్‌‌ చెప్పాడు. ముగ్గురి పాత్రలకు ప్రాధాన్యతను ఇస్తూ నైంటీస్‌‌ బ్యాక్‌‌డ్రాప్‌‌లో ఈ పీరియాడిక్ క్రైమ్ డ్రామాను తెరకెక్కించినట్టు టీజర్‌‌‌‌తో అర్థమవుతోంది.

‘నగరం, తుపాకీ రెండు ఒకటే, అవి వాటిని పట్టుకున్న వ్యక్తి మాట వింటాయి’ అంటూ డైలాగ్‌తో టీజర్‌ ఆసక్తికరంగా ప్రారంభమైంది.‘కత్తితో జీవించేవాడు కత్తితో చనిపోతాడు’అనే బైబిల్‌ నోట్‌తో టీజర్‌ను ముగించిన తీరు ఆకట్టుకుంది. 

ఇక టీజర్‌‌‌‌ లాంచ్‌‌ ఈవెంట్‌‌లో డైరెక్టర్ కేకే మాట్లాడుతూ ‘నాగార్జున గారి ‘కేడీ’తర్వాత మణిరత్నం గారి సినిమాలకు వర్క్ చేశా. మళ్లీ ఇన్నేళ్లకు దర్శకుడిగా ఈ చిత్రంతో ప్రేక్షకుల ముందుకొస్తున్నా. క్రిమినల్స్‌‌ నేరచరిత్రను చాలా సినిమాల్లో చూపించారు. కానీ వాళ్లకు కూడా ఓ మనసు, భావోద్వేగాలు ఉంటాయనేదే ఈ మూవీ కాన్సెప్ట్‌‌’అని చెప్పాడు.

దీక్షిత్ శెట్టి మాట్లాడుతూ ‘చూడ్డానికి యాక్షన్ సినిమాలా కనిపించినా ఇదొక ఎమోషనల్ డ్రైవ్‌‌ ఉన్న సినిమా’అని చెప్పాడు. శశి మాట్లాడుతూ ‘ఓ మంచి క్యారెక్టర్ రాసి కొత్త వాడినైనా నేను చేయగలనని నమ్మి అవకాశం ఇచ్చిన దర్శకుడికి థ్యాంక్స్‌‌’అని అన్నాడు. ‘రంగబలి’చిత్రం తర్వాత మరోసారి తెలుగు ప్రేక్షకుల ముందుకు రావడం సంతోషంగా ఉందని యుక్తి తరేజా చెప్పింది.  డీవోపీ నాగేష్ తదితరులు పాల్గొన్నారు.