హాలీవుడ్కు చెందిన ప్రముఖ నటి కిర్స్టీ అల్లీ (71) కన్నుమూశారు. గత కొంత కాలంగా క్యాన్సర్ తో బాధపడుతున్న ఆమె ఈనెల 5వ తేదీ (సోమవారం) రాత్రి తుదిశ్వాస విడిచారు. ఈ విషయాన్ని కిర్స్టీ కుమారుడు విలియం ట్రూ స్టీవెన్సన్, కుమార్తె లిల్లీ ప్రైస్ స్టీవెన్సన్ సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. తమ తల్లికి క్యాన్సర్ ఉందని ఇటీవల గుర్తించామని, దాంతో పోరాడుతూనే మరణించారని తెలిపారు.
తమ తల్లి కిర్ స్టీ అల్లీ.. ఇన్నాళ్లూ గొప్పగా పోరాడిందని, ఆమె జీవితంలోని అంతులేని ఆనందాలను తమకు వదిలేసి వెళ్లిపోయిందని సోషల్ మీడియా ద్వారా తెలిపారు. మోఫిట్ క్యాన్సర్ సెంటర్లోని వైద్యులు, నర్సుల బృందం మెరుగైన చికిత్స అందించారని, వారికి తాము కృతజ్ఞతలు తెలుపుతున్నామని చెప్పారు.
నటి కిర్స్టీ అల్లీ 1970లో బాబ్ అల్లీని వివాహం చేసుకున్నారు. 1977లో వారిద్దరూ విడిపోయారు. తర్వాత పార్కర్ స్టీవెన్సన్ను పెళ్లి చేసుకుని ఇద్దరు పిల్లలకు జన్మనిచ్చారు.
కిర్స్టీ అల్లీ 1987 నుంచి 1993 వరకు ఎన్బీసీ సిట్కామ్ ‘‘చీర్స్’’లో రెబెక్కా హోవే పాత్రను పోషించి.. మంచి గుర్తింపు పొందారు. ఈ పాత్ర కోసం ఆమె 1991లో ఎమ్మీ అవార్డు, గోల్డెన్ గ్లోబ్ను అందుకున్నారు. టీవీ కార్యక్రమాల్లో హోస్ట్ గానూ వ్యవహరించారు.