జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో బీజేపీ జెండా ఎగరాలి : మంత్రి కిషన్రెడ్డి

జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో బీజేపీ జెండా ఎగరాలి : మంత్రి కిషన్రెడ్డి
  • కేంద్ర మంత్రి కిషన్​రెడ్డి

జూబ్లీహిల్స్, వెలుగు: గత పదేండ్లుగా కేసీఆర్ హయాంలో తెలంగాణ బందీగా ఉన్నదని, ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి ఎన్నికల హామీలను నెరవేర్చడంలో విఫలమయ్యారని కేంద్రమంత్రి కిషన్​రెడ్డి విమర్శించారు. బీజేపీ అధికారంలోకి వస్తేనే తెలంగాణ అభివృద్ధి సాధ్యమన్నారు. జూబ్లీహిల్స్​ నియోజకవర్గం యూసుఫ్​గూడలో స్థానిక నాయకుడు రాగుల సాయి కృష్ణ ఆధ్వర్యంలో పలువురు ఆదివారం బీజేపీలో చేరారు. 

వీరికి కిషన్​రెడ్డి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో బీజేపీ అభ్యర్థిని గెలిపించాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు.  నేతలు లంకాల దీపక్​రెడ్డి, గౌతంరావు, ప్రేమ్​కుమార్​, అట్లూరి రామకృష్ణ, కిలారి మనోహర్ ఉన్నారు.