RCB vs KKR : రెచ్చిపోయిన KKR బ్యాటర్స్.. బెంగళూరుకు భారీ టార్గెట్

RCB vs KKR : రెచ్చిపోయిన KKR బ్యాటర్స్.. బెంగళూరుకు భారీ టార్గెట్

చిన్న స్వామి స్టేడియంలో పరుగుల మోత మోగింది. కోల్ కతా నైట్ రైడర్స్ బ్యాట్స్ మెన్ బెంగళూరు బౌలర్లకు చుక్కలు చూపించారు. సిక్సర్లు, ఫోర్లు బాదుతూ భారీ స్కోరు చేశారు. దీంతో నిర్ణీత 20 ఓవర్లలో కోల్ కతా 5 వికెట్ల నష్టానికి 200 పరుగులు చేసింది. 

ఓపెనర్ గా వచ్నిన జేసన్ రాయ్ (56, 29 బంతుల్లో) మొదటి ఓవర్ నుంచే విరుచుకుపడ్డాడు. ఇన్నింగ్స్ లో 5 సిక్సర్లు బాదాడు. జగదీషన్ (27, 29 బంతుల్లో) చక్కటి ఇన్నింగ్స్ తో స్కోర్ బోర్డ్ ను ముందుకు నడిపించాడు. వీళ్ల తర్వాత వచ్చిన నితిష్ రానా (48, 21 బంతుల్లో), వెంకటేష్ అయ్యర్ (31, 26 బంతుల్లో)తో కలిసి కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడాడు. 

చివర్లో డేవిడ్ వీస్ (12, 3 బంతుల్లో), రింకు సింగ్ (18, 10 బంతుల్లో) మెరుపులు తోడవడంతో కోల్ కతా 200 పరుగుల మైలు రాయికి చేరుకుంది. బెంగళూరు బౌలర్లలో హసరంగ, విజయ్ కుమార్ వైషాక్ చెరో రెండు వికెట్లు పడగొట్టారు. మహమ్మద్ సిరాజ్ కు ఒక వికెట్ దక్కింది.