
ఏకనా క్రికెట్ స్టేడియం వేదికగా గుజరాత్ టైటాన్స్ జట్టుతో జరిగిన మ్యాచ్ లో లక్నో సూపర్ జాయింట్స్ కెప్టెన్ కేఎల్ రాహుల్ అరుదైన రికార్డు సృష్టించాడు. ఐపీఎల్ లో197 ఇన్నింగ్స్ల్లో 7000కు పైగా పరుగులు కంప్లీట్ చేశాడు. దీంతో రాహుల్ కింగ్ విరాట్ కోహ్లీ రికార్డును బ్రేక్ చేశాడు. కోహ్లీ 212 ఇన్నింగ్స్లలో ఈ మైలురాయిని చేరుకోగా రాహుల్ ఇప్పుడు దీనిని అధిగమించాడు.
దీంతో తక్కువ ఇన్ని్ంగ్స్ లో 7000 పరుగులు పూర్తి చేసిన భారత తొలి ఆటగాడిగా రాహుల్ నిలిచాడు. ఇక శిఖర్ ధావన్ 246 ఇన్నింగ్స్లలో 7000 పరుగులు చేసిన మూడో భారత ఆటగాడుగా నిలిచాడు. ఈ లిస్టులో ముంబై ఇండియన్స్ కెప్టెన్ రోహిత్ శర్మ నాలుగో ప్లేస్ లో ఉన్నాడు. రోహిత్ 258 ఇన్నింగ్స్ల్లో 7000 పరుగులు పూర్తి చేశాడు.
ఇక గుజరాత్ టైటాన్స్ తో మ్యాచ్ లో 7 పరుగుల తేడాతో లక్నో సూపర్ జాయింట్స్ టీమ్ ఓడిపోయింది. 135 పరుగుల టార్గెట్ తో బరిలోకి దిగిన లక్నోను కట్టడి చేసింది. లక్నో 20 ఓవర్లలో 128 పరుగులు మాత్రమే చేసింది. కేఎల్ రాహుల్ (68; 61 బంతుల్లో 8 ఫోర్లు) అర్ధ శతకంతో రాణించినా ఫలితం లేకుండా పోయింది. అంతకుముందు టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న గుజరాత్ టైటాన్స్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 135 పరుగులు చేసింది.