- ఇంజనీరింగ్, మెడికల్, వృత్తి విద్య కాలేజీల ఏర్పాటు
- సొంత నియోజకవర్గంపై సీఎం రేవంత్ ఫోకస్
కొడంగల్, వెలుగు: ఎడ్యుకేషన్హబ్గా కొడంగల్ మారనుంది. ఇంజనీరింగ్, మెడికల్, వృత్తి విద్య, నర్సింగ్, ఆయుష్, అగ్రికల్చర్, మిల్లెట్ రీసెర్చ్ సెంటర్, మహిళా డిగ్రీ కాలేజీ ఏర్పాటుతో హయ్యర్ఎడ్యుకేషన్కు కేరాఫ్గా నిలవనుంది. ప్రతి మండల కేంద్రంలో జూనియర్ కాలేజీ నిర్మించేందుకు అధికారులు స్థల పరిశీలన చేశారు. సీఎం రేవంత్రెడ్డి కూడా తన సెగ్మెంట్పై ప్రత్యేకంగా ఫోకస్ పెట్టారు. ప్రత్యేక విజన్ ఉంటేనే కొడంగల్అభివృద్ధి సాధ్యమవుతుందని గతంలోనే ఆయన ప్రకటించారు. ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు కొడంగల్కు పాలిటెక్నిక్ కాలేజీ, గ్యాస్ అథారిటీ ఆఫ్ ఇండియా(గెయిల్) నిధులతో కొడంగల్, కోస్గి ప్రభుత్వ జూనియర్ కాలేజీల నిర్మాణాలు చేపట్టారు.
డిగ్రీ కాలేజీ నిర్మాణానికి రెరా ద్వారా నిధులు మంజూరు చేయించారు. కొడంగల్లో డిగ్రీ, ఇంటర్ కాలేజీలు, హైస్కూళ్లు ఉండగా.. సొంత భవనాలు లేక గురుకులాలు వేరే చోటుకు తరలించారు. గత ప్రభుత్వం నియోజకవర్గాన్ని నిర్లక్ష్యం చేసింది. వెనకబడ్డ సెగ్మెంట్ను ప్రస్తుతం ఆదర్శంగా తీర్చిదిద్దేందుకు ప్లానింగ్ సిద్ధం చేశారు. ఇందులో భాగంగా కొడంగల్ఏరియా డెవలప్మెంట్అథారిటీ( కడా) ఏర్పాటు చేశారు.