జగన్పై కత్తితో దాడి చేసిన శ్రీనుకు బెయిల్

జగన్పై కత్తితో దాడి చేసిన శ్రీనుకు బెయిల్

సీఎం జగన్మోహన్ రెడ్డిపై కోడికత్తితో దాడి చేసిన కేసులో నిందితుడిగా ఉన్న జనపల్లి శ్రీనివాస్‌కు హైకోర్టులో ఊరట లభించింది. నిందితుడు జనపల్లి శ్రీనివాస్ కు ఏపీ హైకోర్టు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. అలాగే కేసు వివరాలను నిందితుడు మీడియాతో మాట్లాడొద్దని, ర్యాలీలు, సభల్లో పాల్గొనవద్దని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. 

కోడికత్తి కేసులో ఐదేళ్లు జైలులో నిందితుడిగా ఉన్న జనపల్లి శ్రీనివాస్‌కు న్యాయ స్థానం రిలీఫ్ కల్పించడంపై.. అతని కుటుంబ సభ్యులు ఆనందం వ్యక్తం చేశారు. అలాగే ఈ తీర్పుపై దళిత, పౌర సంఘాలు హర్షం వ్యక్తం చేశారు. విశాఖ సెంట్రల్ జైలులో శ్రీను దీక్ష చేసినట్లు ప్రచారం జరిగిన విషయం తెలిసిందే. తనకు న్యాయం చేయాలని కోరాడు. సీఎం జగన్ వచ్చి సాక్ష్యం చెప్పాలని అన్నాడు. శ్రీనివాస్‌కు మద్దతుగా ఆయన తల్లి సావిత్రమ్మ, సోదరుడు సుబ్బరాజు కూడా ఇటీవల దీక్ష చేశారు.